మాములుగా యాపిల్ ఐఫోన్ ని కొనుగోలు చేయాలంటే కనీసం రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులను ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. అయితే అతి త్వరలోనే విడుదల కానున్న యాపిల్ బ్రాండ్ న్యూ ఫోన్ ను మాత్రం కేవలం రూ.15 వేలకే సొంతం చేసుకోవచ్చు.అవును..నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా కాని ఇదే నిజం. ఇక లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మార్చి 8 వ తేదీన ఐఫోన్ ఎస్ఈ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా కూడా విడుదల కానుంది. ఇక ఇదే తేదీన జరగనున్న ఈవెంట్‌లో యాపిల్ సంస్థ 5జీ ఐఫోన్ ఎస్ఈ 3ని లాంచ్ చేస్తున్నట్లు ఫేమస్ టెక్ నిపుణులు కూడా చెబుతున్నారు.ఇక ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానున్న ఈ ఐఫోన్ ధర వచ్చేసి రూ. 30,000గా నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఇంకా అలాగే ఇతర ఈ-కామర్స్ వెబ్ సైట్‌లలో ఇది కేవలం రూ.26,999 ధరకే అందుబాటులోకి రావచ్చని సమాచారం అనేది తెలుస్తోంది. ఈ వెబ్ సైట్‌ల్లో బ్యాంక్ ఇంకా తదితర ఆఫర్ల కింద మీరు చాలా డిస్కౌంట్ పొంది ఈ కొత్త ఫోన్ ను రూ.15,000కే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.


ఇక ఈ ఫోన్ యాపిల్ ఏ15 బయోనిక్ చిప్ ఇంకా అలాగే 5జీ సపోర్ట్ లతో వస్తుందని సమాచారం అనేది తెలుస్తుంది. ఇక మిగతా మెయిన్ ఫీచర్స్ గురించి అయితే మాత్రం ఇంకా ఎవరూ కూడా సరిగా వెల్లడించలేదు.అయితే కేవలం రూ.15 వేలకే ఈ ఐఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తే వీటి సేల్స్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా వుంది. ఇక ఇప్పటికే యాపిల్ డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో 2.3 మిలియన్ ఫోన్లను అమ్ముకుని ఇక 34 శాతం వార్షిక వృద్ధిని రిజిస్టర్ చేసింది. ఇక మార్కెట్ డేటా ప్రకారం, యాపిల్ కంపెనీ ఇండియాలో 5 శాతం కంటే తక్కువ మార్కెట్ షేర్ అనేది కలిగి ఉంది. ఇక అందుకు కారణం ఏంటంటే ఇండియాలో రూ.15-20 వేల రేంజ్ లోనే ఎక్కువ మంది మొబైల్ ఫోన్లు కొంటుంటారు. అందుకే ఈ ప్రైజ్ రేంజ్ లో ఐఫోన్స్ తీసుకొచ్చి మార్కెట్ షేర్ ని మరింత పెంచుకోవాలని యాపిల్ కంపెనీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: