తాజాగా వన్ ప్లస్ ఇండియా భారతదేశ మార్కెట్లో వన్ ప్లస్ 10 pro 5g స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే వన్ ప్లస్ 10 pro 5g మొదటి అమ్మకం ఈ రోజు ప్రారంభం అయ్యింది. ఇకపోతే మొదటి సేల్ తోనే భారీ ఆఫర్ ను ప్రకటించింది ఈ కంపెనీ. ఇకపోతే ఇదివరకే చైనాలో వన్ ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయినప్పటికీ వన్ ప్లస్ అభిమానులు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ని ఇండియాలో ఉన్న అభిమానుల కోసం వన్ ప్లస్ స్మార్ట్ఫోన్ తీసుకురావడం జరిగింది.

ఇకపోతే ఈ కొత్త మొబైల్ ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ తో రిలీజ్ కావడం గమనార్హం. ఇక ఇందులో 120hz రిఫ్రెష్ రేటుతో లతో 2.0 అమొలెడ్ డిస్ప్లే అలాగే 48 megapixel సోనీ IMX 789 సెన్సార్ తో పాటు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ఇలాంటి ఫ్లాగ్ షిప్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. పందికి ఈ స్మార్ట్ ఫోన్ పై వన్ ప్లస్ అభిమానులలో చాలా ఆసక్తి నెలకొనడం గమనార్హం. ఇక ఈ వన్ ప్లస్ 10 ప్రో 5 జీ స్మార్ట్ఫోన్ రెండు రకాల వేరియంట్ లతో రిలీజ్ అయింది.

8జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ వున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.66,999 కాగా, 12జీబీ ర్యామ్ తో పాటు  256జీబీ స్టోరేజ్ వేరియంట్ వున్న ఈ స్మార్ట్ ఫోన్  ధర రూ.71,999. ఇక ఈ స్మార్ట్ ఫోన్ సెల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.4,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా మీకు  లభిస్తుంది. వోల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్స్‌లో  కూడా మీరు కొనొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: