ఇక ఫ్రెషర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.వారికి రహదారుల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ హైవే ప్రాజెక్టుల్లో పలు ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లను చేపట్టనుంది..వీటికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఇక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రెషర్స్ ఇంకా సివిల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి వచ్చే నెల 15..ఇక సెంట్రల్ రోడ్డు రవాణా సంస్థ బీటెక్ లేదా ఎంటెక్ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆన్-ఫీల్డ్ ట్రైనింగ్ అనేది పొందనున్నారు. ఈ ఇంటర్న్‌షిప్ అనేది మూడు నెలల పాటు జరగనుంది. ఈ సమయంలో అభ్యర్థులను హైవే ప్రాజెక్టుల కాంట్రాక్టర్ ఇంకా అలాగే కన్సల్టెంట్‌కు కేటాయిస్తారు.ఇక వీటికి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు ఎంటెక్ చేసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే బీటెక్ ఇంకా ఎంటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.


గత సెమిస్టర్‌లలో 7.0 లేదా 70 శాతం మార్కులతో CGPA అనేది సాధించి ఉండాలి..అలాగే నేషనల్ హైవేస్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి AICTE పోర్టల్ aicte-india.orgను మీరు సందర్శించాలి.ఈ ఇంటర్న్‌షిప్ లింక్‌ పై క్లిక్ చేసి అవసరమైన సమాచారాన్ని పూరించడం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు..ఇక రహదారుల మంత్రిత్వ శాఖ ఎంపికైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనుంది. అలాగే వివిధ రకాల నేషనల్ హైవేస్ ప్రాజెక్టులను చేపట్టే ఏజెన్సీలు NHAI ఇంకా NHIDCL వంటి వాటికి అభ్యర్థులను కేటాయించనున్నారు. ఈ ఇంటర్న్‌షిప్ కోసం ఎంపికైన బీటెక్ విద్యార్థులకు నెలకు రూ. 10,000, ఇంకా ఎంటెక్ విద్యార్థులు రూ. 15,000 స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. అలాగే ఇంటర్న్‌ల వసతి ఇంకా రవాణా ఖర్చులను కూడా కేంద్ర రోడ్డు రవాణా శాఖ భరించనుంది. ఈ ఇంటర్న్ షిప్ విజయంతంగా పూర్తి చేసిన తరువాత అభ్యర్థులకు సర్టిఫికేట్ ఇవ్వనున్నారు.ఇందులో అభ్యర్థి 75 మార్కులను పొందాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: