వెరసి అధునాతన టెక్నాలజీ కారణంగా వస్తున్న మార్పులు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల కాలంలో ప్రతి మనిషి జీవితంలో డ్రోన్ అనేది ఎంతో కీలకం గా మారిపోయింది. మొన్నటివరకు రక్షణ రంగంలో ఇక శత్రువుల కదలికలను కనుగొనడానికి మాత్రమే డ్రోన్లను ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు ఏకంగా మినీ బాంబులను మోసే డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మరోవైపు పెళ్ళిళ్ళు శుభకార్యాలు కూడా ఉపయోగిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో అయితే మెడిసిన్స్ తరలించేందుకు కూడా డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు కేవలం వస్తువులను కాదు ఏకంగా మనుషులను తరలించే డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. ఏకంగా మనిషిని మోసుకెళ్ల కలిగిన సామర్థ్యంతో ఓ డ్రోన్ రూపొందించినట్లు పుణేకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ డ్రోన్ కి వరుణ అనే ఒక పేరు కూడా పెట్టింది. దీనిపై డెమో కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు 130 కిలోల బరువు గల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందట. అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులను త్వరగా తరలించేందుకు ఈ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.