ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువగా వినియోగించే బైక్ మోడల్ ఏది అంటే అది రాయల్ ఎన్ఫీల్డ్ అని చెబుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే రాయల్ ఎన్ఫీల్డ్ ను స్టేటస్ కు తగ్గట్టుగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఇతను కంపెనీ నుంచి హిమాలయన్ 450 మోటార్ సైకిల్ ను  లాంచ్ చేయబోతోంది. ముఖ్యంగా ఈ బైక్ ఎలా ఉండబోతోంది అని చెప్పడానికి చిన్న టీజర్ ని కూడా విడుదల చేయడం గమనార్హం. లడక్ ప్రాంతంలో ఎక్కడో ఒక చిన్న నదిని దాటుతున్న మోటార్ సైకిల్ ని చూపిస్తూ ఎన్ఫీల్డ్ అభిమానులను టీస్ చేసింది. ఇక రీసెంట్గా విడుదల చేసిన ఈ టీజర్ లో మీరు రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 ముందు భాగాన్ని మాత్రమే చూడగలరు. ఇందులో హెడ్ లాంప్ కోసం హాలోజన్ బల్బును ఉపయోగించలేదు దానికి బదులుగా ఆధునిక ఎల్ఈడి బల్బులను ఉపయోగించారు.

ఇక హెడ్ లైట్ అవుట్ గోయింగ్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 415 తరహాలో వృత్తాకారంగా ఉంది. ఇక ఈ బైక్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే 450 సిసి లిక్విడ్ కూల్ ,సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉపయోగిస్తున్నారు. ఇక అసిస్టెంట్ క్లచ్ సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ తో  ఈ బైకు రావచ్చని ఆశిస్తున్నారు కస్టమర్లు . అంతేకాదు ఇంకా ఎన్నో మార్పులు కూడా ఉండవచ్చు అనే సమాచారం కూడా అందుతోంది. ముఖ్యంగా విస్తృతమైన టైర్లు , ముందువైపున మరింత అధునాతన అడ్జస్టబుల్ యు.ఎస్.డి ఫోర్కులు , రైడ్ మోడ్ లు, ఇన్ఫర్మేషన్ క్లస్టర్ కొంచెం పెద్ద పెట్రోల్ ట్యాంక్ వంటివి ఉండొచ్చు అని సమాచారం.

ఇకపోతే కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 విడుదలతో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న కెటిఎమ్ 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జి310 GS వంటి శక్తివంతమైన మోటార్ సైకిల్ తో ఈ కంపెనీ పోటీ పడవచ్చు. అంతేకాకుండా కొత్త మోటార్ సైకిల్ ను విడుదల చేయడం కోసం చాలామంది కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ బైకు ధర రూ. 3.25 లక్షలు ఉండవచ్చని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: