తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షో `జబర్ధస్త్‌`. ఈ షోకు మాములుగా ప్రసారమయ్యే సమయంలో ఎంత మంది చూస్తారో.. యూట్యూబ్‌లో అంతకు రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు. దీంతో గత ఏడేళ్లుగా ఈ షో అప్రతిహతంగా దూసుకుపోతుంది. అయితే మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలె జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ యాజమాన్యం మల్లెమాలతో విభేదాలు, ఆర్ధిక లావాదేవీల కారణంగా జబర్దస్త్ ను వీడి.. జీ తెలుగులో కొత్తగా  ‘అదిరింది’ వేదికపైకి ఒచ్చినట్టు ప్రకటించారు నాగబాబు. ఇక ఈయ‌న జ‌బ‌ర్ద‌స్త్ నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ ఈ షో రేటింగ్స్‌కు మాత్రం గ‌డిప‌డ‌లేదు.

 

కాని,  ఆ ప్లేస్ లో జడ్జిగా ఎవరు వస్తారా అనే సస్పెన్స్ ఇన్ని రోజులు కొనసాగింది. అయితే ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో జడ్జ్ కనబడటంతో అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. కొన్ని ఎపిసోడ్స్ లో నరేష్, పోసాని ఇలా వరుసగా మారుతూ వస్తున్నారు. అయితే తాజాగా ప్రసారం అయిన ప్రోమోలో ఈ సారి ప్రముఖ సింగర్ మనో కనిపించారు. అయితే ఈ సారి మాత్రం జబర్దస్త్ కు ఫుల్ టైమ్ జడ్జి దొరికినట్లే అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ జడ్జి సీటులో కొనసాగాలంటే మాత్రం ఏం చేయాలి అనే దానిపై హైపర్ ఆది క్లారిటీ ఇచ్చేశాడు. 

 

ఎంచక్కా నవ్వుతూ ఉంటే పది ఎపిసోడ్ల పాటు మీరే జడ్జి అంటూ సింగర్ మనోకు హింట్ ఇచ్చాడు. అయితే వాస్త‌వానికి మనో వాయిస్ తో పాటు, హావభావాలు పలికించడంలో దిట్ట అనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే పలు టీవీ చానెల్స్ లో పాటల పోటీలు, అలాగే ఇతర రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరించిన అనుభవం ఉన్న మనో అయితే జబర్దస్త్ కు సెట్ అవుతాడనే టాక్ వినిపిస్తోంది. ఇక దీంతో నాగ‌బాబు గ‌ట్టిదెబ్బే త‌గిలింద‌ని అంటున్నారు కొంద‌రు. ఎందుకంటే అటు అదిరింది షో అనుకున్నంత స‌క్సెస్ కావ‌డం లేదు.. ఇటు జ‌బ‌ర్ద‌స్త్ ఈయ‌న అంచ‌నాల‌కు చిక్క‌కుండా జోరుగా దూసుకుపోతోంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: