మనం.. మన పక్కన ఉన్నవారు ఒక్క డబల్ మీనింగ్ మాట మాట్లాడిన హర్ట్ అవుతాం కానీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇప్పుడు ఢీ.. అన్ని షోస్ లో వాళ్ళు మాట్లాడేది డబల్ మీనింగ్ మాటలే.. అయినా జనాలు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరి చూసి నవ్వుతుంటారు. ఇంకా అందుకే వాళ్ళు కూడా తగ్గకుండా డైలాగ్స్ తో రెచ్చిపోతుంటారు. 

 

ఇంకా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లు జరగక ఇన్నాళ్లు ఈ డబల్ మీనింగ్ షో స్ అన్ని ఆగిపోయాయి. అయితే ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తి వేశారు కదా! ఇంకా ఏముంది ? షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా డబల్ మీనింగ్ ప్రోగ్రాములు అన్ని ప్రారంభమై చావులకు తూట్లు పడేలా డైలాగులు వేశారు. 

 

ఇంకా అలానే జబర్దస్త్, ఢీ షోస్‌కి సంబంధించిన ప్రోమోలు విడుదల అయ్యి యూట్యూబ్ లో ఓ రేంజ్ లో హాల్ చల్ అవుతున్నాయి. ఇంకా ఆ షోస్ లో అయితే హైపర్ ఆది వల్గర్ కామెంట్స్‌ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాయి. ఇంకా ఢీ షోలో టీమ్ మెంటర్స్‌గా ఉన్న హైపర్ ఆది, వర్షిణీ జంట మీద ఇప్పటికే ఎన్నో దారుణమైన పుకార్లు హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అలాంటి ఈ సమయంలో వాటి డైలాగ్స్ వదిలాడు.

 

ఆ ప్రోమోలో వర్షిణితో ''ఇంకొకడిని ట్రై చేద్దాం పదా'' అనే డైలాగ్ ఓ రేంజ్ లో షికారు చేస్తుంది. ఇప్పటికే ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగులు హైపర్ అది వెయ్యడం.. జడ్జిలు బల్లలు గుద్ది నవ్వడం అంత ఏంటో.. ఈ డబల్ మీనింగ్ ఎప్పుడు బ్యాన్ చేస్తారో.. ఈ ప్రేక్షకులు ఎప్పుడు ఈ షోలను ఆపుతారో అంటూ సోషల్ మీడియాలో డైలాగులు హాల్ చల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: