బిగ్ బాస్.. ప్రస్తుతం ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అయ్యింది.సినిమాలను మించిన కొంటె చూపులు.. బిగి కౌగిలిలో బందించి నలిగిపోతున్నారు.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే కామెడీ చేస్తామంటూ వచ్చి కమిట్ అవుతున్నారు అంటూ ప్రేక్షకులు అంటున్నారు.అది నిజమే అనుకోండి.. పగలు హాట్ డ్యాన్స్ లతో పిచ్చెక్కిస్తారు.. కాస్త రిలాక్స్ అవుతారు. తర్వాత చూడండి.బిందెల కాడ ఆడవాళ్ళ గొడవలాగా మారుతుంది.ఇకపోతే ఈ షో వల్ల బాగా టీఆర్పీ రేటింగ్ పెరగడంతో పాటుగా డబ్బులు కూడా రావడంతో హౌస్ లోని కెమెరాలు మొత్తం ఆ తర్వాత ఏంటి..ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లు ఫోకస్ చేస్తారు.



తెలుగులో ఈ షో సీజన్ 4 ను జరుపుకుంటుంది..ఆరు వారాలు దాటిన ఈ షో లో ఆరుగురు బయటకు వెళ్లిపోయారు. ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. వారందరూ హౌస్ లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న వాళ్ళే.. అయితే ఎలిమినేట్ అవుతుంది అనుకున్న మోనాల్ లక్కీగా లోపలికి వచ్చేసింది..ఇప్పుడు ప్రేక్షకులు మళ్లీ ఆమెను బయటకు  పంపించాలని ఫిక్స్ అయ్యారు. అన్నిటికన్నా ముఖ్యమైనది నిన్న జరిగిన మంచి మనుషులు,రాక్షసులు టాస్క్.. మరో రొమాంటిక్ జంటను పరిచయం చేసింది.. మొత్తానికి హౌస్ లో హారిక కామం తో రెచ్చిపోతుంది అంటూ కామెంట్లు అందుకుంటుంది.



ఇది ఇలా ఉండగా... ఇప్పుడు మరో రచ్చ మొదలైంది.. అమ్మా రాజశేఖర్ మాస్టర్ వైఫ్ రాధా లాస్య పై మండిపడ్డారు. తాజాగా ఓ యుట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మాట్లాడుతూ..వృత్తి పరంగా నా భర్త రాజశేఖర్ వందల మంది అమ్మాయిలతో పనిచేశారు.. ప్రొఫెషనల్ పరంగా ఆయన్ని ఒక టాస్క్‌లో సంచాలకుడిగా పెట్టారు. కానీ యాంకర్ లాస్య చాలా రిజర్వ్డ్ టైప్ అనుకుంటా.. అనవసరంగా నా భర్తపై నింద వేసేసింది..నా భర్త తప్పు చేయడు.. తప్పు చేసావని అంటే భరించలేరు..అంటూ రాధా లాస్య పై మండి పడింది..ప్రస్తుతం ఈ విషయం దుమారం రేపుతున్నాయి.. ఇక ఈ విషయం పై ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: