బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.. అయితే నేటితో ఈ షో మొదలై పన్నెండు వారాలు పూర్తి చేసుకుంది.ఈ షో పై ప్రశంసలు ఎంతగా అందుకుందో, అంతకు మించి విమర్శలు కూడా అందుకుంది. ప్రస్తుతం ఈ షో లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు, హాట్ రొమాన్స్ చేస్తున్నారు.యువత ఈ షో ను ఇష్టంగా చూస్తే మరి కొందరు మాత్రం ఇదొక బూతుల కు కేరాఫ్ గా నిలుస్తుందని దుమ్మెత్తి పోస్తున్నారు. 



ఈ షో ను ఫాలో అయ్యేవారిలో సెలెబ్రెటీలు కూడా ఉన్నారు. తూటాల్లాంటి మాటలతో టాలీవుడ్‌లో సీరియర్ రచయితగా పేరొందిన పరుచూరి గోపాలకృష్ణ బిగ్ బాస్ షో చూడటమే కాదు.. అద్భుతమైన విశ్లేషణ అందిస్తున్నారు.ఆ షో పై చాలా మంది అనుకున్న విషయాలను పరిశీలించి న పరుచూరి గోపాల కృష్ణ తన పరుచూరి పలుకులలో వివరించారు.ఈ షో లో నాగార్జున ప్రతిభ గురించి, ఎవరు ఎలా చేస్తున్నారు అనే విషయాల గురించి ఆయన మాట్లాడారు.



ఆయన మాట్లాడుతూ..బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ నాగార్జున ఎలా చేస్తున్నాడో చూద్దాం. చిన్న రామయ్య ఎన్టీఆర్ సీజన్ 2, నాని సీజన్ 2, నాగార్జున సీజన్ 3.. వీటన్నింటినీ చూశాం. ముగ్గురూ చాలా బాగా చేశారు. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వాళ్లని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది.. మాములుగా చెప్పాలంటే ఈ షో లో పాల్గొనాలంటే భారీగా పేరు తెచ్చుకొని ఉండాలి అలా కాకుండా మాములుగా ఉన్న వాళ్ల ఈ సీజన్ లో పాల్గొన్నారు.షో చూస్తుంటే మేం ఎవరు వెళ్లిపోతారని అనుకుంటున్నామో వాళ్లు వెళ్లట్లేదు.. ఎవరు వెళ్లరు అనుకుంటున్నామో వాళ్లు వెళ్లిపోతున్నారు. 



అందుకే నాగార్జున ఒకటికి పదిసార్లు చెప్తున్నారు. మిస్డ్ కాల్, హాట్ స్టార్ ద్వారా ఓట్లు వేయాలని చెప్తున్నారు. అలానే ఓటింగ్ రావడంతో చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చారు.. నాగార్జున బాబూ నీకు అభినందనలు. ప్రేక్షకులకు తెలియని చిన్న చిన్న పిల్లల్ని తీసుకువచ్చి వాళ్లని మట్టిలో దొరికిన మాణిక్యాలుగా చేశారు. అంటూ ప్రశంసల వర్షం కురిపించారు..అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: