ఇక బిగ్ బాస్ లోని కొంతమంది కంటెస్టెంట్ లు ఇప్పుడు ఓ కామెడి షో ద్వారా మళ్ళీ సందడి చేసేందుకు రెడీ అయ్యారు. కామెడీ స్టార్స్ పేరుతో త్వరలో మా టీవీలో ప్రసారం కాబోతున్న షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేయబోతోన్నారు. అవినాష్, సుజాత,అరియానా ఈ షోతో అభిమానులను అలరించనున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ఫ్యాన్స్ ఆకర్షిస్తోంది. ఇక జబర్దస్త్,ఆదిరింది షోలతో కామెడి పంచ్లను ఎంజాయి చేసిన అభిమానులు ఈ సరికొత్త షో మరింతగా ఎంటటైన్ కానున్నారు. అవినాష్ జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత అతనితో మా టీవీ ఓ బిగ్ కామెడీ చేయబోతోన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవి నిజమయ్యాయి. అవినాష్ పెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్గా ఈ కామెడీ స్టార్స్ షోను రన్ చేయనున్నారు. వర్షిణి యాంకర్గా ఉండగా శేఖర్ మాస్టర్, శ్రీదేవీ ఈ షోకు జడ్జ్లుగా వ్వవహరించనున్నారు.
తాజాగా రీలిజ్ చేసిన ఈ షో ప్రోమో గ్రాండ్ లుక్గా కనిపిస్తోంది. ఆ ప్రోమోలో అవినాష్ సుజాత కలిసి బాగానే ఎంటర్టైన్మెంట్ చేశారు. ఒకరినొకరు సెటైర్లు వేసుకున్న తీరు పంచ్లు బాగానే వైరల్ అయ్యాయి. ఇక్కడ అవినాష్ జబర్దస్త్ స్ట్రాటజీని వాడుతున్నట్టుంది. ప్రోమోలో సుజాతను అవినాష్ పట్టుకోవడంతో రియాక్ట్ అయిన సుజాత స్కిట్లో ఛాన్స్ దొరికింది కదా అని పట్టుకుంటున్నాడు.. ఎన్నోద్దులు అవుతుందో ఆడగాలి తాకక అని అవినాష్పై సెటైర్ వేసింది. అలాగే చమ్మక్ చంద్ర, యాదమ్మ రాజు, బేబి సహృద(కార్తీక దీపం హిమ) తదితరులు కనిపించారు.