ఓ ప్రముఖ తెలుగు ఛానల్లో దిగ్విజయంగా కొనసాగుతున్న కోయిలమ్మ సీరియల్ లో హీరోగా అమర్ అనే ఒక ఆర్టిస్ట్ నటిస్తున్నాడు. అయితే తాజాగా ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పూటుగా తాగి మణికొండలో నివసిస్తున్న ఇద్దరు మహిళల పై అమర్ దౌర్జన్యం చేశాడనే ఆరోపణలపై తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు రాయదుర్గం పోలీసులు వెల్లడించారు.

అయితే శ్రీవిద్య అనే ఒక మహిళ మాట్లాడుతూ.. అమర్ తో పాటు ముగ్గురు ఆకతాయిలు మరియు అమర్ ప్రేయసి స్వాతి రాత్రి సమయంలో తమ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసారని ఆమె ఆరోపిస్తున్నారు. అమర్ తన పై దౌర్జన్యం చేయడమే కాక అసభ్య పదజాలంతో లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే శ్రీ విద్యతోపాటు అపర్ణ అనే మరొక మహిళ కూడా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి అమర్ పై ఫిర్యాదు చేశారు. తమకు అమర్ ఐదు లక్షలు ఇవ్వాల్సి ఉందని.. అవి తిరిగి ఇవ్వాలని అడిగితే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని.. అమర్, స్వాతి ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కోయిలమ్మ హీరోతో పాటు ఆయన ప్రేయసిపై రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అయితే శ్రీవిద్య, స్వాతి ల మధ్య వ్యాపారపరమైన గొడవలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. శ్రీవిద్య, స్వాతి, లక్ష్మి అనే ముగ్గురు మహిళలు కలిసి మణికొండలో బౌటిక్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ వ్యాపారంలోని లావాదేవీలలో తేడాలు రావడంతో స్వాతి పూర్తిగా వ్యాపారం నుంచి వైదొలిగారు. అయితే పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చేసిన స్వాతికి రావాల్సిన డబ్బులు శ్రీవిద్య ఇవ్వకపోవడంతో.. ఆమె బుల్లితెర నటుడు అయిన అమర్ తో కలిసి శ్రీవిద్య ఇంటికి వెళ్లి గట్టిగా నిలదీశారు. ఈ సందర్భంలోనే వారి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో శ్రీవిద్య పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ఫిర్యాదు చేయగా.. అమర్, స్వాతి లు కూడా రివర్స్ కేసు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: