తన అందం అభినయంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను చాలాకాలంపాటు అలరించిన సమీరా షరీఫ్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె సీరియళ్లకు, ప్రోగ్రాములకు దూరంగా ఉంటున్నారు. జీ తెలుగు లో ప్రసారం అయిన ఎన్నో సీరియళ్ళలో ఆమె వరుసగా నటించారు. నాగబాబు నేతృత్వంలో ప్రారంభమైన అదిరింది కామెడీ షో కి ఆమె యాంకర్ గా కూడా వ్యవహరించారు. అప్పుడే ఆమెకు బాగా పాపులారిటీ వచ్చింది.

అయితే సీనియర్ నటిమణి సనా బేగం కుమారుడు సయ్యద్ అన్వర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన యాక్టింగ్ కెరీర్ కి విరామం ఇచ్చారు. కానీ యూట్యూబ్ లోని తన సొంత ఛానల్లో వీడియోలు పెడుతూ తన అభిమానులకు టచ్ లోనే ఉంటున్నారు. సయ్యద్ తల్లి సనా బేగం ఆవిడా మా ఆవిడే సినిమాలో హెడ్ కానిస్టేబుల్ విక్టోరియా పాత్రలో నటించారు. రాజా ది గ్రేట్ సినిమా లో ఆమె హీరోయిన్ లక్కీ కి ఆంటీగా నటించారు. ఆమె తన సినిమా కెరీర్ లో ఎక్కువగా భార్య, అత్త, పిన్ని వంటి క్యారెక్టర్ రోల్స్ లో చేశారు.

సీరియల్స్ లో హీరో పాత్రలో నటించే ఒక వ్యక్తి తో సమీరా కి ఎఫైర్ ఉందని అప్పట్లో పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సమీరా షరీఫ్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తనపై గతంలో వచ్చిన పుకార్ల పై స్పందించారు. తన గురించి తప్పుడు ప్రచారం చేసింది తాను ఎప్పుడూ అక్క గా భావించే ఒక సీరియల్ నటి అని సమీరా వెల్లడించారు. అక్క గా భావించిన సహానటి తన పక్కనే ఉంటూ తన గురించి తప్పుడు ప్రచారం చేసింది అనే విషయం తనకు చాలా ఆలస్యంగా తెలిసింది అని ఆమె అన్నారు. తన గురించి తప్పుడు పుకార్లు సృష్టించిందనే నిజాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని సమీరా తన బాధను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎవరితో కూడా క్లోజ్ గా ఉండాలి అనుకోవడం లేదని.. వృత్తిపరంగా మాత్రమే మాట్లాడటం తప్పించి.. ఎవరితోనూ క్లోజ్ గా ఉండే ధైర్యం కూడా చేయనని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: