బుల్లి తెరపై సక్సెస్ ఫుల్ గా సాగుతున్న కామెడీ షో ఇది.. అయితే ఈ షో ద్వారా చాలా మంది మంచి సినిమా అవకాశాలను అందుకోవడం విశేషం. అయితే ఇప్పుడు ఈ షో కొంచెం రచ్చగా కూడా మారుతుంది. టీం లీడర్ల పై చాలా మంది గొడవకు దిగడం వంటి ఘటనలను ప్రతి షో లో చూస్తుంటాం.. అయితే ఇప్పుడు షో లో టీమ్ లీడర్ పై చెయ్యి చేసుకున్నారు అనే వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.


వివరాల్లోకి వెళితే.. జబర్ధస్త్ షో కేవలం ఆర్టిస్టులకు మాత్రమే కాదు.. అందులో పని చేసిన ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. మరీ ముఖ్యంగా షో ఆరంభం నుంచి జడ్జ్‌లుగా పని చేసిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబుకు ఈ షో మరింత ప్లస్ అయింది. అలాగే, గ్లామరస్ బ్యూటీలు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ యాంకరింగ్ కెరీర్‌లకు బాగా ఉపయోగపడిందీ కామెడీ షో.జబర్ధస్త్ షోను ఆదరించేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మందే ఉన్నారు. అదే సమయంలో ఈ షోను వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు.


 ఈ కామెడీ షోలో అశ్లీలతతో పాటు డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నారని, మహిళలను కించపరుస్తున్నారని, కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా స్కిట్లు చేస్తున్నారని చాలా ఆరోపణలు వచ్చాయి. గతంలో చాలా సార్లు ఈ షో ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. షోలో భాగంగా ఇమాన్యూయేల్.. తాగుబోతు రమేష్ స్కిట్‌లో చేశాడు. ఎంతో ఫన్నీగా సాగిన ఇందులో వీళ్లిద్దరూ అదిరిపోయే పంచులతో ఆకట్టుకున్నారు. అదే సమయంలో స్కిట్ కోసం తాగుబోతు రమేష్‌ను ఇమాన్యూయేల్ కొట్టాడు. అయితే, అది అతడిని నిజంగానే తగిలింది. దీంతో రోజాతో పాటు అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. ఆ తర్వాత అతడు సారీ కూడా చెప్పాడు.ఇమాన్యూయేల్ ఒకడు. 'పటాస్' అనే షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన అతడు.. తనదైన శైలి కామెడీతో సందడి చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఆ షో ఆగిపోవడంతో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆకట్టుకుని, ఇప్పుడు సెకెండ్ లీడ్‌గా చేస్తున్నాడు.. టీమ్ లీడర్ ను గతంలో కూడా కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: