గత రెండు రోజులుగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పేరు మారుమోగుతున్న విషయం అందరికి తెలిసిందే. పూటుగా మద్యం సేవించి రోడ్ పైన కారు తో అడ్డు వచ్చిన వారిని డీ కొట్టుకుంటూ వెళ్లి అరెస్ట్ కావడం కూడా అందరికి తెలిసిందే. షణ్ముఖ్ సినిమా ఇండస్ట్రీ లో అవకాశం కోసం ప్రయత్నించి అది విఫలం కావడంతో వైవా అనే వెబ్ సిరీస్ లో అక్కడ నుండి స్టార్ గా మారాడు. ఈ మధ్య కాలం లో యూట్యూబ్ లో బాగా పాపులర్ అయినా సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ఘన విజయం కావడం వెనక షణ్ముఖ్ పాత్ర పూర్తి స్థాయి లో ఉంది. ఇక సోషల్ మీడియా లో చూసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ని మూడు కోట్లకు పైగా మంది ఫాలో చేస్తున్నారు. ఇంత స్టార్ డం వచ్చాక షణ్ముఖ్ ఇలాంటి ఒక పని చేసి అందరి లో నవ్వుల పాలు కావడం నిజంగా బాధాకరం.

అయితే షణ్ముఖ్ హిట్ అండ్ రన్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జైలు కి తరలించారు. ఈ నేపథ్యం లో షణ్ముఖ్ తల్లి అతడి పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె చెప్పిన విషయాల ప్రకారం, కారు నడిపిన క్రమంలో షణ్ముఖ్ అంత ఎక్కువగా ఏమి తాగలేదని, అది ఒక పొరపాటుగా మాత్రమే చూడాలని, కావాలని చేసింది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు షణ్ముఖ్ చేసిన ప్రమాదం గురించి మీడియా అత్యుస్త్సహాన్ని కూడా ఆమె విభేదించారు. విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూపించవద్దంటూ ఆమె చెప్పారు. మరి షణ్ముఖ్ చేసిన పనికి అతడికి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదు కానీ, బాధితులకు న్యాయం జరగాలని, ఇలాంటి సంఘటనలు మల్లి జరగకుండా చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: