జబర్దస్త్ లో సుధీర్ స్కిట్ లు ప్రేక్షకులకు బాగా కనువిందు చేస్తుంటాయి. అందుకు ముఖ్య కారణం గెటప్ శీను అని చెప్పవచ్చు. ఒక్కో స్కిట్ కు ఒక్కో రకంగా తనదైన శైలిలో గెటప్ లు వేసి ప్రేక్షకుల ఆదరణ పొందిన టీం ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతూనే ఉన్నారు. ఇక అంతే కాకుండా ఒకప్పుడు జబర్దస్త్ జడ్జి గా పనిచేసిన నాగబాబు కూడా వీరి టీం గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.
ఇక జబర్దస్త్ కు రాకముందు వీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. ముఖ్యంగా గెటప్ శీను చాలా ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో తినడానికి తిండి లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయట. అలా కొన్ని రోజులు తమ బంధువు అయినటువంటి పిన్ని ఇంట్లో ఉండేవాడట. పని కోసం రోజంతా వెతికి అలసిపోయి వచ్చి తనకు,పిన్ని చేతిలో భోజనం చేయడం ద్వారా, ఆ అలసట అంతా మర్చిపోయేవాడట.
అలా కొద్ది రోజులు తమ పిన్ని ఇంట్లో ఉండడం భారంగా అనిపించడంతో.. మ్యాగీ అనే ఒక ఫ్రెండ్ దగ్గర ఉండేవాడట. అతను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ ఉండేవాడు. తనతోపాటే శీను కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. అక్కడ కూడా శీను ఆకలితో అలమటించే వాడట. ఇక తన ఉద్యోగం వేటకోసం వెళ్లే సమయంలో తన దగ్గర ఒక రూపాయి డబ్బులు కూడా లేవట. అలా అలా ఒకసారి దానిమ్మ పిందెలు కూడా తినే పరిస్థితి వచ్చిందట.
కానీ ఇప్పుడు ప్రస్తుతం గెటప్ శీను దాదాపుగా లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.