ఇటీవల బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రోజు రోజుకి ఇందులో నటించే నటులు శృతిమించి పోతున్నారు. ఇప్పటికే వర్ష - ఇమ్మాన్యుయెల్ చేసే పనులకే ప్రేక్షకులు భరించలేక పోతుంటే , ఇప్పుడు సరికొత్తగా రాకేష్ - రోహిణి లు కూడా శృతిమించి పోతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు వీరు చేసే పనుల వల్ల షో కి కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ వీరు కేవలం షోకి టిఆర్పి రేటింగ్ సాధించడం కోసమే ఇవన్నీ చేస్తున్నారనే విషయం తెలిసినప్పటికీ , మరి లైవ్ లో శృతి మించి పోవడం ఏంటి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఇకపోతే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇప్పటికీ 350 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందుకు సందర్భంగా స్పెషల్ స్కిట్ లతో అలరించారు ఇందులో ఉన్న నటులు. ఈ స్కిట్ లో భాగంగానే అందరూ చూస్తుండగానే రాకేష్, రోహిణి లు ముద్దులతో చెలరేగిపోయారు. ఇది చూసిన జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా కూడా షాక్ గురవుతూ,  సిగ్గుతో తలవంచుకుంది. ప్రస్తుతం ఈ వార్త కాస్త బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారింది.


ఇకపోతే ఇంతకుముందు రోహిణి బుగ్గపై రాకేష్ ముద్దు పెట్టడం మనం చూసే ఉంటాం ..అయితే ఈ వార్తలపై స్పందించిన రోహిణి.. రాకేష్ పెట్టే ముష్టి ముద్దు కూడా  ఒక ముద్దు యేనా..? నిజంగానే రాకేష్ ముద్దు పెడితే నా సంకలో పెట్టి , వాడిని నలిపేస్తాను అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది ..కానీ ఇప్పుడు చూస్తే ఏకంగా లిప్ టు లిప్ కిస్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవడం తోపాటు ఇపుడేమంటారు రోహిణీ అంటూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో రొమాంటిక్ సీన్స్ సినిమాలకు మించి పోయేలా ఉన్నాయి అంటూ కామెంట్  చేయడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: