బిగ్ బాస్ లో జరిగే గొడవల్లో తిండి గొడలవే ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం బిగ్ బాస్ లో అన్నింటికీ తట్టుకొని ఉండాల్సి ఉంటుంది. ఇక సెలబ్రిటీలు ఎక్కువగా పౌష్టికాహారం మరియు రుచికరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి తిండి కట్ చేస్తే ఎక్కువ కోపం వచ్చే అవకాశం ఉంది. దాన్ని రేటింగ్ లా మార్చుకోవాలనే బిగ్ బాస్ గొడవలు సృష్టిస్తూ ఉంటాడు. అంతే కాకుండా హౌస్ లో టాస్క్ లు మినహా ఇంటి సభ్యులకు ఎలాంటి పని ఉండదు. ఇక వంట ఉండడమే అతి పెద్ద పని. కాబట్టి ఇంటి సభ్యుల మధ్య తరచూ ఫుడ్ వండటం విషయం లో కూడా విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి.

గత సీజన్ల లో కూడా ఫుడ్ విషయంలోనే ఎక్కువ గొడవలు జరిగినట్టు కనిపించింది. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 నిన్నటి ప్రోమో విడుదల చేయగా అందులో కెప్టెన్ శ్రీరామ్ మరియు  సభ్యుడు జెస్సీ మధ్య కూడా ఫుడ్ విషయంలో గొడవ జరిగింది. ప్రోమో లో ఎవడి ఫుడ్ వాడే వండుకోవాలి అని రూల్ పెడతా అంటూ శ్రీరామ్ చెప్పగా...ఫుడ్ ఇవ్వనూ..ఫుడ్ ఇవ్వను అంటున్నావ్. ఎవరు చెప్పారు. అంటూ జెస్సీ శ్రీరామ్  పై ఫైర్ అయ్యాడు. దాంతో మధ్యలో జెస్సీ కి సపోర్ట్ గా షణ్మఖ్ రావడంతో శ్రీరామ్ నీకు అవసరం లేదు మధ్యలో రావద్దు అంటూ హెచ్చరించాడు.

ఇది బిగ్ బాస్ హౌస్ నా ఫ్రెండ్ ను అంటే నేను వచ్చా అంటూ షణ్ముక్ వాదించాడు. దాంతో శ్రీరామ్ నేను కూడా నీకు ఫ్రెండ్ అయినా నీకు అసలు జరిగిన మ్యాటర్ తెలీదు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదంటూ చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య లొల్లి మొదలైంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో జెస్సీ, షణ్ముక్, సిరి లతో గ్రూప్ ఫామ్ అయిన సంగతి తెలిసిందే. మిగతా ఇంటి సభ్యులతో ఈ ముగ్గురు తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. అంతే కాకుండా తాజాగా ప్రోమో చూస్తుంటే ఈవారం షణ్ముక్ ను ఎక్కువమంది నామినేట్ చేయగా షణ్ముక్  నేను ఏంటో చూపిస్తా అంటూ డైలాగ్ వేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: