బిగ్ బాస్ షో లో ఈ మధ్య ప్రియ ఆంటీ సన్నిపై బాగా పగబట్టేసింది అంటున్నారు నెటిజన్లు. హౌస్ లో సన్నీ పట్ల ఆమె ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. బంగారు కోడిపెట్ట మొదలు కాకముందే నేను అందరి కోడిగుడ్ల జోలికి వెళతాను ఏం చేస్తారో చేసుకోండి హా హా హా అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ లు అలా ఓ విసురు విసురుతూ సన్ని ని ఉద్దేశించి మాట్లాడారని అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అంతేనా టాస్క్ లోనూ తను అన్నట్టే చేస్తున్నారు ప్రియ. కెప్టెన్సీ పోటీదారులుగా అందరూ ఈసారి కెప్టెన్సీ దక్కించుకోవడానికి నాన తంటాలు పడుతుంటే... ప్రియ మాత్రం తన మాటలతో, బిహేవియర్ తో అందరి ముందు నవ్వుల పాలు అవుతోంది.

ఈ టాస్క్ లో ఆమె ప్రవర్తన చూసిన వారంతా ప్రియ ఆంటీ నీలో ఇంత మార్పు ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ టాస్క్‌లో ప్రత్యేకమైన ఎల్లో కలర్  గుడ్డుని సొంతం చేసుకున్నాడు విశ్వ . ఆ పవర్‌‌తో తను ఏకంగా ఐదు గుడ్లును పొందవచ్చనమాట.  అయితే  దానికి కూడా ఒక పోటీ ఉండటంతో ..కాజల్‌ని పోటీదారుగా ఎంపిక చేసుకున్నాడు విశ్వ. పోటీ ఏమిటంటే ఎవరైతే ఎక్కువ వస్త్రాలను ధరిస్తారో వారు ఐదు గుడ్లును పొందగలరు. దాంతో అటు విశ్వ ఇటు కాజల్  ఒంటిపై ఒకదానిపై ఒకటి బట్టలు వేసుకుంటూ బాగా పోటీ పడ్డారు. చివరికి విశ్వ గెలవడంతో అతడికి బోనస్ గుడ్లు లభించాయి.

ఈ టాస్క్ లో కామెడీ కూడా బాగానే పండింది. సన్ని ఆ అండర్వేర్ లన్ని నావేరా బాబు అంటూ ఫన్నీ డైలాగులతో అందర్నీ నవ్వించాడు. అంతేకాదు అందరు నిద్రపోయాక సన్ని దొంగలా చాలా సైలెంట్ గా అందరి కోడిగుడ్లను దొంగతనం చేయడం మొదలెట్టేశాడు. ఇలా ఈ టాస్క్ లో సన్ని చాలా హైలెట్ అయ్యాడు. మరో వైపు ప్రియ మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ కనబరిచింది.  ఇంతలా ప్రియలో మార్పు రావడానికి కారణం ఏమై ఉంటుందంటూ అందరూ తలలు పీక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: