తెలుగు రాష్ట్రాలలో గతా ఆరు వారాలుగా బిగ్ బాస్ సందడి జరుగుతోంది. సోమ వారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు వస్తుంది అలాగే శనివారం మరియు ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. మొదట్లో అంతగా ప్రభావం చూపని ఈ షో, వారాలు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకులు బిగ్ బాస్ షో  కు బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ సారి కూడా నాగార్జున నే హోస్ట్ గా కొనసాగించడంపై కాస్త వ్యతిరేకత ఉంది.  ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ముఖ్యంగా హౌజ్ లో ఒకటిగా ఉంటూ వచ్చిన ముగ్గురు ఇంటి సభ్యుల మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టారు. 

గత మూడు రోజుల నుండి జరుగుతున్న గుడ్లు టాస్క్ లో బాగంగా బిగ్ బాస్ జెస్సీ కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు.  ఈ టాస్క్ ను సరిగా అర్ధం చేసుకోకుండా టాస్క్ లో ఫెయిల్ అయ్యాడు. ఈ సీక్రెట్ టాస్క్ ద్వారా ఎఫెక్ట్ అయిన వారిలో షణ్ముఖ్, ప్రియ మరియు ప్రియంకలు ఉన్నారు. అయితే షణ్ముఖ్ మాత్రం ఓవర్ గా ఫీల్ అయ్యాడు అని అందరికీ తెలుస్తోంది. అందుకే సిరి మరియు జెస్సీ లను దూరం పెడుతున్నాడు. అయితే దీనికి తట్టుకోలేని సిరి కన్నీటి పర్యంతం అయింది. నమ్మి ఇద్దరూ కలిసి వెధవను చేశారంటూ వారిపై విరుచుకు పడ్డాడు. దానితో త్రిమూర్తుల్లా ఉన్న ముగ్గురూ బిగ్ బాస్ పుణ్యమా అని విడిపోయారు. 

ఇంటిలో లవర్స్ లా ప్రేక్షకులకు అనిపిస్తున్న సిరి షణ్ముఖ్ లు విడిపోయారు. దీనితో వీరి ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. అయితే ఇది ఎక్కువ సేపు ఇలాగే జరుగుతుంది అని చెప్పలేం. రేపో ఎల్లుండో మళ్ళీ ఏరా...ఏరా అంటూ ఇద్దరూ కలిసిపోతారు అని అందరూ సెటైర్లు వేసుకుంటున్నారు. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: