ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల కే కాదు బుల్లితెరపై నటిస్తున్న నటీనటులకు కూడా అంతే స్థాయిలో పాపులారిటీ అందుతోంది.. కరోనా పుణ్యమా అని గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ సీరియల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.. దీంతో సీరియల్స్ అన్నిటికి చక్కటి టి ఆర్ పి రేటింగ్ పెరగడంతో పాటు నటీనటులకు కూడా మంచి ఇమేజ్ వస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కు మంచి గుర్తింపు అలాగే ఆదరణ కూడా లభిస్తోంది.. ఈటీవీలో మధ్యాహ్నం సమయంలో ప్రసారమయ్యే అభిషేకం సీరియల్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది..


ఇందులో నటించే నటీనటులు కూడా నిజజీవితంలో మన పక్కనే ఉన్నారా అన్నట్టుగా చాలా నాచురల్ గా నటిస్తూ మరింత దగ్గరవుతున్నారు.. ఇందులో ఈ సీరియల్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సుభద్ర.. ఈమె అసలు పేరు, ఈమె రియల్ లైఫ్ స్టోరీ గురించి కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..


సుభద్ర అలియాస్ వందన.. చూడడానికి హీరోయిన్ లాగా ఉంటుంది.. ఇక వందనాను ఈమె అభిమానులు ఎంతో మంది సినిమాల్లో ట్రై చేయమని అడుగుతూ ఉంటారు..ఇక వందన కాకినాడకు చెందిన అమ్మాయి. ఇక ఈమెకు ఒక చెల్లి, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. స్కూల్ అండ్ కాలేజీ కూడా హైదరాబాద్లోనే పూర్తి చేసుకుంది. బి ఫార్మసీ నీ వూటీలో పూర్తిచేసింది. బీఫార్మసీ కంప్లీట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పూర్ణ  చంద్ర శేఖర్ తో వివాహం జరిగింది. ఇక వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు.


వందన బి ఫాం సీ పూర్తి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం కూడా చేసింది. అయితే తన కొలీగ్స్ తో కలిసి అనుకోకుండా ఒక సారి ఈ టివి లో ప్రసారమైన స్టార్ మహిళ షోలో పాల్గొని సందడి చేసింది. స్టార్ మహిళ టైటిల్ ను  కూడా గెలవడం గమనార్హం. ఇక పోతే స్టార్ మహిళ ప్రోగ్రాం డైరెక్టర్ వందన ను యాంకర్ గా చేయమని అడిగితే ఓకే అని చెప్పిందట. మూవీ మిర్చి అనే షో ద్వారా యాంకరింగ్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత భార్యామణి సీరియల్ ద్వారా బుల్లితెర పై అడుగు వేసింది. తర్వాత అంతఃపురం, హృదయం అనే సీరియల్స్లో కూడా నటించింది. ఇక ప్రస్తుతం అభిషేకం సీరియల్ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: