ప్రస్తుతం ఉన్న కాలంలో మనీ తోనే ప్రతి ఒక్కరి జీవితం ముడి పడిందని చెప్పవచ్చు. మనీ వల్ల ఎవరి జీవితం ఎలా మారుతుందో ఏమో చెప్పలేము. అలాంటి డబ్బులు లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేము. ఎటువంటి వారినైనా వారి యొక్క జీవితాలు ముందుకు సాగాలి అంటే కచ్చితంగా డబ్బు ఉండాల్సిందే.. అయితే ప్రస్తుతం నటిగా మంచి పేరు సంపాదించుకొని వరుస సీరియల్ లో నటిస్తున్న నటి కార్తీక దీపం మోనిత(శోభాశెట్టి) తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ట్లు తెలిసింది. వాటి గురించి చూద్దాం.

ప్రస్తుత జీవితం బాగున్నప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేని స్థితిలో ఉండేదట. తన విషయాలను సూపర్ క్వీన్ అనే ప్రోగ్రాంలో తెలియజేసింది. ఈ షో కి యాంకర్ గా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడు. ఇది జీ తెలుగులో ప్రసారం అవుతుంది.ఇక ఆమెకు సంబంధించి ఒక ఫోటో ని ప్రదీప్ చూపించగా.. ఆమె తన గతాన్ని గుర్తు చేసుకున్నది. నాకు బాగా గుర్తున్నది ఆరెండు బూట్లకు కొన్ని పిన్నీసులు వేసుకొని బడికి వెళ్లేదాన్ని అని తెలిపింది.


అప్పట్లో చెక్కులు గుర్తించాలంటే ఐదు రూపాయల వరకు ఖర్చు అయ్యేది.. అంత డబ్బులు మా దగ్గర లేకపోవడంతో దాదాపుగా 20 కిలోమీటర్ల పైనే నడుచుకుంటూ వెళ్లానని తెలియజేసింది. తన గతాన్ని తెలుపుతూ కన్నీరు పెట్టింది శోభా శెట్టి.

ప్రతి ఒక్కరి జీవితంలో.. చెప్పులు దిగిపోయి ఉంటాయి వాటికి పెట్టుకోవడం వంటివి సంఘటనలు అందరికీ జరిగి ఉంటాయని తెలిపింది. కొంతమంది నడుస్తూ ఉన్నప్పుడు చెప్పు తెగిపోతే.. ఆ సమయంలో ఏం తెలియాకా పిన్నీసులు పెట్టుకుని ఉంటారు.అలా తన జీవితంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయని తెలియజేశారు. ఇక మరికొన్ని విషయాలను తెలియజేసింది. నెటిజెన్స్ మాత్రం మేము కూడా ఎన్నోసార్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామని  కామెంట్ రూపంలో తెలియజేశారు. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: