'జబర్దస్త్ షో'తో ఒక్క సారిగా పాపులర్ అయ్యారు యాంకర్ అనసూయ మరియు రేష్మి లు. మొదట అనసూయ మాత్రమే యాంకర్ గా ఉండగా ఆ తరవాత అనసూయ కాస్త గ్యాప్ తీసుకోవడంతో ఆ హాట్ సీట్ లోకి వచ్చి కూర్చుంది. ఆ తర్వాత మళ్లీ ఎలాగో షోని జబర్దస్త్ అని ఎక్స్ట్రా జబర్దస్త్ అని ఇద్దరికీ రెండు షో లు అప్పగించారు. ఈ రెండు షోలు ద్వారా వీరికి ఎంత గుర్తింపు వచ్చిందో? వీరి యాంకరింగ్ జబర్దస్త్ షోకి అంతే ప్లస్ అయ్యిందని చెప్పాలి. అయితే తొమ్మిదేళ్లు పాటుగా జబర్దస్త్ రాణులుగా ఏలుతున్నారు. ఈ షోతో పెంచుకున్న క్రేజ్ తో సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు అనడంలో అతిశయోక్తి కాదు.

అక్కడ కూడా అదృష్టం కలిసి రావడంతో ఈ అందాల భామలు వరుసగా మంచి ఆఫర్లతో దూసుకుపోతున్నారు. సినిమాల్లో ఎంత బిజీ అయినా తమకు లక్ ఇచ్చిన జబర్దస్త్ హాట్ సీట్ ను మాత్రం ఏ మాత్రం అస్సలు వదలడం లేదు ఈ ముద్దుగుమ్మలు. అయితే ఇపుడు తాజాగా జబర్దస్త్ షోకి సంబందించిన ఒక వార్త వీరి అభిమానులను కలవరపెడుతోంది. జబర్దస్త్ షో కి కొత్త యాంకర్ రాబోతోంది అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే అను, రేష్మి లలో ఎవరి ప్లేస్ ను రీప్లేస్ చేయబోతుందో తెలియదు. కానీ మొత్తానికి కొత్త యాంకర్ రావడానికి మాత్రం ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం.

అయితే హీరోయిన్లతో సమానంగా ఫాలోయింగ్ ఉన్న అనసూయ, రేష్మి లను కాదని మరో యాంకర్ అంటున్నారు. అంటే ఎవరా అతిలోక సుందరి అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ వార్త నిజమే అని క్లారిటీ వస్తే జబర్దస్త్ షో విడిచే యాంకర్ ఎవరో తెలుస్తోంది. ఇద్దర్లో ఎవరు వెళ్లినా ఫ్యాన్స్ మాత్రం బాగా హార్ట్ అవుతారు మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: