బుల్లితెరపై యాంకర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి.. యాంకర్ గా ఎంతో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ లు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న జాతి రత్నాలు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ది. ఇక ఈ షో కూడా జబర్దస్త్ తరహాలోనే కామెడీ షో లు నిర్వహించడం జరుగుతోంది. ఇక జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లకు యాంకర్ గా వస్తున్న రష్మి , అనసూయ లు కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే జాతి రత్నాల కోసం శ్రీముఖి కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటోంది.


జాతి రత్నాలు షో కోసం శ్రీముఖి, అనసూయ తరహా లోనే అత్యధిక పారితోషికం అందుకుంటోంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ షో కేవలం షెడ్యూల్ ప్రకారమే ఉంటుందట. అందుచేతనే శ్రీముఖి రెమ్యూనరేషన్ కూడా.. మొదటి షెడ్యూల్ కి 6 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్  అందుకు న్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఒక్కో షో కి అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకునేది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై అవకాశాలు లేకుండా పోవడంతో తన రెమ్యూనరేషన్ కూడా బాగా తగ్గించింది అన్నట్టుగా వార్త లు వినిపిస్తున్నాయి.

అయితే శ్రీముఖి గతంలో బుల్లితెర మీద కంటే వెండితెర మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అందుచేతనే ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ పై ఎక్కువ ఫోకస్ చేయలేకపోయింది. అయితే మల్లె మాల సంస్థవారు శ్రీముఖి ని జాతిరత్నాలు షోకి తీసుకోవడానికి గల ముఖ్య కారణం గతంలో కూడా మల్లెమాల వారితో ఈమెకు బాగా సన్నిహితంగా ఉండడం చేత ఈమె రెమ్యూనరేషన్ తక్కువగా ఇచ్చినప్పటికీ ఈ  కార్యక్రమానికి యాంకర్గా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో శ్రీముఖి అత్యధికంగా రెమ్యూనరేషన్ అందు కుంటుంది ఏమో చూడా లి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: