మూగజీవాలను హింసించే వారిని రష్మీ ఎప్పుడు ఉపేక్షించదు. తనకు వీలైనంత లో వారిని శిక్షపడేలా చేస్తూ ఉంటుంది. అందరికీ రీచ్ అయ్యేలా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ఆ బాధాకరమైన దృశ్యాలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా కొంత మందిని కలిసి ఓ కుక్క ను దారుణంగా కొట్టి కొట్టి చంపడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వీడియో ఎంతో క్రూరంగా ఉన్నది. దీనిపై రష్మి స్పందించడం కూడా జరిగింది.
ఇక రష్మి అసలు వీళ్లు మనుషులేనా.. వారికి జాలి దయ అనేది ఉండవా.. వాళ్లు మనుషులకు పుట్టారా..? అంటూ యాంకర్ రష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. వారికి శిక్ష పడేవరకు ఈ వీడియో ని షేర్ చేస్తూ ఉండండి అని తన అభిమానులను కోరుతోంది. అయితే వారిని పోలీసులు అరెస్టు చేశారట అయినా కూడా రష్మీ కోపం మాత్రం చల్లార లేదని తెలిపింది. వారికి శిక్ష పడిన కూడా దాని ప్రాణాలు మాత్రం తిరిగి రావు కదా అని.. వాళ్లని పెంచిన తల్లిదండ్రులను తిట్టి పోస్తోంది. ప్రస్తుతం యాంకర్ రష్మి షేర్ చేసిన ఈ పోస్టు చాలా వైరల్ గా మారుతోంది.