గతంలో ఎంతో ఘనంగా ఉన్నటువంటి జబర్దస్త్ షో పరిస్థితి ఇప్పుడు చాలా గోరంగా మారిపోతోంది. గతంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిన జబర్దస్త్ ఇప్పుడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందుకు కారణం ఏంటి అనే విషయం మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు.. జబర్దస్త్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా పేరు దక్కించుకున్న షో అని చెప్పవచ్చు. ఈ షో కాస్తా ఇప్పుడు చాలా మంది లైట్ తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. టీమ్ లీడర్స్ ఎంతోమంది ఈ షోని వదిలి పోవడం జరిగింది. ఇక ఇందులో ఉండే కొంతమంది పక్క ఛానల్ లో సందడి చేస్తూ ఉన్నారు. అయితే మల్లెమాల సంస్థవారు పారితోషకం ఈ విషయంలో కాస్త ఇబ్బంది పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ నుండి మొదట్లో కొందరు టీమ్ లీడర్లు వెళ్ళిపోయినా కూడా సుడిగాలి సుదీర్ ,హైపర్ ఆది, అదిరే అభి వంటి వారు ఈ షో ని నెట్టుకురావడం జరుగుతూ ఉండేది. కాస్త రేటింగ్ బాగానే ఉండేది. కానీ ఇప్పుడు వాళ్లు కూడా వెళ్లిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతోంది జబర్దస్త్ షో. ముఖ్యంగా ఇటీవలే రోజా కూడా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది.


దీంతో సుధీర్ హైపర్ ఆది వంటివారు కూడా బయటికి వచ్చేశారు అనే వార్త వినిపిస్తోంది. సుధీర్ ఆది వంటి వారు లేకుండా ఈ షో నడిపించడం అంత సులువైనది కాదు. అలాంటిది ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా పక్క చూపులు చూస్తోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఈమె ఈటీవీలో పార్ట్ టైం అన్నట్లుగానే యాంకర్ చేస్తోంది. ఇప్పుడు దానిని కూడా వదిలేసి యాంకర్గా గుడ్ బాయ్ చెప్పబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రెండు ఎపిసోడ్లు వస్తున్న జబర్దస్త్ ను ఒక్క ఎపిసోడ్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక ఒక్క ఎపిసోడ్ అంటే యాంకర్ రష్మీ చేయబోతోందని దీంతో అనసూయ పక్క ఛానల్ కు జంప్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: