ప్రముఖ దిగ్గజ సంస్ద శాంసంగ్ తాజాగా తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ 'ఎస్6'ను భారత్ లో విడుదల చేసింది. ఇప్పటికే అన్ని కంపెనీలకు ధీటుగా అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లను మార్కెట్ లో విడుదల చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శాంసంగ్ మొబైల్ ఇప్పుడు మరో గ్యాడ్జెట్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.
అదే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ 'ఎస్6'. ఈ ట్యాబ్ ని తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్యాబ్ ధర రూ.59,900. అయితే ఈ ట్యాబ్ ను కొనుగోలు చేసిన కస్టమర్లకు బహుమతిగా 6 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ను అందిస్తుంది. కాగా ఈ ట్యాబ్ ని హెచ్డీఎఫ్సీ కార్డుతో ఈ ట్యాబ్ ను కొనుగోలు చేస్తే 5 వేల రూపాయిల వరుకు క్యాష్బ్యాక్ను అందిస్తున్నారు.
అదిరిపోయే ట్యాబ్ వివరాలు:
10.5 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లే,
ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్,
6జీబీ ర్యామ్,
128 జీబీ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 9.0పై,
13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డాల్బీ అట్మోస్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.0,
యూఎస్బీ టైప్ సి, 7040 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్.
చూశారుగా .. అదిరిపోయే ఫీచర్లను అందిస్తుంది ఈ శాంసంగ్ ట్యాబ్. ఇంకెందుకు ఆలస్యం వెంటనే త్వరపడండి.