మొబైల్ రంగంలోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చినా తనదైన ముద్రని వేసుకుని మొబైల్ ప్రియులకి అత్యంత చేరువ అయిన స్మార్ట్ ఫోన్ మొబైల్ సంస్థ వీవో. మొబైల్ దిగ్గజాలన్నిటికి షాక్ ఇస్తూ గత ఫెస్టివల్ సేల్ లో సత్తా చాటిన సదరు సంస్థ ఇప్పుడు దీపావళి పండుగని టార్గెట్ చేసింది. ఈ పండుగ సీజన్ లో తమ కంపెనీ నుంచీ సరికొత్త మొబైల్స్ ని రంగంలోకి దించుతూ మరిన్ని సేల్స్ సాధించడానికి సిద్దమవుతోంది.

 

ఈ క్రమంలోనే నో కాస్ట్ EMI, మరియు జీరో డౌన్ పేమెంట్ ఆఫర్ల ని ప్రకటిస్తోంది. అంతేకాదు 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని కూడా అందిస్తోంది. వివో నుంచీ వస్తున్న సరికొత్త స్మార్ట్ ఫోన్ వివో వి 17 ప్రో , వి 15 ప్రో వివో Z 1 xలతో 8 జీబీ ర్యామ్ మొబైల్ ఈ ఆఫర్స్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆఫర్స్ అక్టోబర్ 18 నుంచీ 31 వరకూ ఉంటుందని ప్రకటించింది.

 

ఈ ఆఫర్ లో కేవలం 101 రూపాయిలు చెల్లించి వివో సరికొత్త మొబైల్స్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు  101 రూపాయల ఆఫర్ కింద HDB ఫైనాన్స్ ద్వారా అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ సౌకర్యం కూడా ఉంది. HDFC ,ICICI క్రెడిట్ కార్డుల ద్వారా కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ సౌకర్యం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: