మొబైల్ విపణిలోకి దూసుకొచ్చిన వివో అనతికాలంలోనే భారత మార్కెట్ లో పాగా వేసింది. అధునాతన ఫీచర్స్ తో అందరికి అందుబాటులో ఉండేలా తన మొబైల్స్ ని రూపు దిద్దిన వివో, ఎప్పటికప్పుడు సరికొత్తగా ముస్తాబతువుతూ కొత్త కొత్త ఆఫర్స్ తో వినియోగ దారులని ఆకట్టుకుంటోంది. తాజాగా వివో ఓ భారీ ఆఫర్ ని ప్రకటించింది. త్వరలో ఈ ఆఫర్ ని విడుదల చేస్తామని తెలిపింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే..

 

వివో తన ఫోన్లు కొనుగోలు చేసే వారికి ఇక నుంచీ ఉచితంగా బ్లూటూత్ మరియు హెడ్ ఫోన్స్ ఇస్తున్నట్లుగా తెలిపింది. తమ కంపెనీ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ని అందిస్తున్నట్లుగా సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ ఆఫర్ ఈ నెల 29 తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేకాదు..

 

హెడ్ ఫోన్స్ తో పాటుగా మరో బహుమతి కూడా అందించ నుంది వివో. సుమారు రూ .60 వేల విలువగల ప్రయోజనాలు వినియోగ దారులు పొందవచ్చట. అయితే అందుకు ఒక కండిషన్ కూడా పెట్టింది. ఈ ప్రయోజనాలు అన్నీ పొందాలంటే తప్పకుండా ప్రతీ వివో వినియోగదారుడు తన మొబైల్ లో వివో రివార్డ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సంస్థ తెలిపింది. డౌన్లోడ్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసిన తరువాత అందులో క్లెయిమ్ యువర్ రివార్డ్ అనే బ్యానర్ పై ప్రెస్ చేసి వినియోగదారుడు తన లోకేష్ ఎంచుకోవాలి. ఆ తరువాత రివార్డ్స్ రివీల్ చేసి క్లెయిమ్ చేసుకోవాలని సంస్థ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: