ఉపగ్రహ నిఘా వ్యవస్థతో దేశ సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసే క్రమంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి ఈ నెల 27న పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ను, దీని ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను బుధవారం అంటే ఈ రోజు కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ రోజు ఉదయం 9.28 గంటలకు నింగిలోకి రాకెట్ దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ 14 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది.
అంతే కాకుండా కార్టోశాట్-3తో పాటూ అమెరికాకు చెందిన ఉపగ్రహాలను.. పీఎస్ఎల్వీ-సీ47 నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించిన కార్టోశాట్-3 జీవిత కాలం ఐదేళ్లు కాగా ఈ ఉపగ్రహం బరువు 1625 కిలోలు ఉండగా రూ.350కోట్లు ఈ ఉపగ్రహం తయారీకి అయ్యిందని తెలిపారు. ఇక మంగళవారం ఉదయం 7.28 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి47 ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైన ఈ ప్రక్రియ 26 గంటలపాటు సాగుతుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ పీఎస్ఎల్వీని ప్రయోగిస్తున్నారు.
బుధవారం ఉదయం 9.28 గంటలకు ఇది నింగిలోకి దూసుకెళ్లనుంది. అనంతరం 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్ మంగళవారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరన్ ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు ప్రయోగిస్తున్న ఈ టెక్నాలజీ హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ భూ ఉపరితల చిత్రాలను తీస్తుంది.
ఇదే కాకుండా ఐదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందించే కార్బోషాట్-3 రెండు వేల వాట్ల సామర్ధ్యం కలిగి ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం తర్వాత మరో రెండు ఉపగ్రహాలను షార్ నుంచి డిసెంబర్ లో ప్రయోగించే అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు.. మరో విషయం ఏంటంటే పీఎస్ఎల్వీ-సీ47 ద్వారా ప్రయోగించే ఈ ఉపగ్రహాన్ని భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో, 97.5 డిగ్రీల కోణంలో ఉంచేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.