కొత్త ఏడాది సరికొత్తగా ఉండేందుకు ప్రతి మొబైల్ కంపెనీ సంస్థలు పోటీ పడి మరీ కొత్త మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి వదిలేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ దూకుడులో షావోమీ, రియల్ మీ వంటి చైనీస్ మొబైల్స్తో పాటు శాంశంగ్, ఐఫోన్, మోటో వంటి పెద్ద కంపెనీలు కూడా పోటీకి దిగాయి. అయితే ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో రియల్మీ దూకుడు కొనసాగిస్తోంది. వరుసగా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే రియల్మీ.. 5 సిరీస్లో భాగంగా రియల్మీ 5ఐ పేరుతో మరో బడ్జెట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. రియల్మీ 5 సిరీస్లో ఇప్పటికే రియల్మీ 5 ప్రో, రియల్మీ 5, రియల్మీ 5ఎస్ రిలీజ్ చేసిన కంపెనీ... ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్పై గురిపెట్టింది. ఇప్పుడు తక్కువ ధరలో రియల్మీ 5ఐ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.8,999 మాత్రమే. రియల్మీ 5ఐ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.52 అంగుళాలు డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తోంది.
అలాగే స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 12+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంఛైంది. ఇప్పుడు ఇండియాకు వచ్చింది. జనవరి 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్తో పాటు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో సేల్ మొదలయ్యింది. రిలయెన్స్ జియో యూజర్లకు రూ.7,550 విలువైన బెనిఫిట్స్ కల్పిస్తోంది. దాంతో పాటు క్యాషిఫై, మొబీక్విక్ నుంచి ఆఫర్స్ ఉన్నాయి.