రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు పలు టెలికాం కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. రిలయన్స్ జియో, వొడాఫోన్, ఎయిర్‌టెల్ కంపెనీల నుంచి ఎదురౌతున్న తీవ్రమైన పోటీ ఇందుకు కారణం కావొచ్చు లేదా కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్ఎల్ కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తూనే, ఆఫర్లు కూడా అందిస్తోంది.

 

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ లేదా అదనపు డేటా ఆఫర్ కింద కొన్ని ప్లాన్లపై అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఓ బంప‌ర్‌ ఆఫర్లను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును ఇప్పుడు 71 రోజుల పాటు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ సాధారణంగా 365 రోజుల చెల్లుబాటు ఉంది. అయితే ఈ ఆఫర్‌తో ప్లాన్ చెల్లుబాటు కాలం 436 రోజుల వరకూ ఎక్స్‌టెండ్ అయ్యింది.

 

అంతేకాదండోయ్..  రోజుకు 3 జీబీ డేటాను అందించడం దీని ప్రత్యేకత. అంటే మీకు మొత్తంగా 1,275 జీబీ డేటా లభిస్తుందన్న మాట. మీరు ఏ నెట్ వర్క్ నుంచి ఏ నెట్ వర్క్ కు అయినా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అయితే కేవలం వ్యాలిడిటీ ఎక్స్ టెన్షన్ మాత్రమే కాకుండా బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, బీఎస్ఎన్ఎల్ టీవీ సబ్ స్క్రిప్షన్లు కూడా ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా లభించనున్నాయి. అయితే ఈ ఆఫర్ 2020 జనవరి 26 నుండి 2020 ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: