చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షావోమీ.. ఇటీవల తమ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో రెడ్మీ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను షావోమీ రిలీజ్ చేస్తుందని అందరూ ఎదురుచూస్తుంటే 'రెడ్మీ 8ఏ డ్యుయెల్' పేరుతో కొత్త మోడల్ ఆవిష్కరించి షాకిచ్చింది. టీజర్లు చూసి మొదట రెడ్మీ 9ఏ స్మార్ట్ఫోన్ రిలీజ్ చేయొచ్చని అంచనా వేశారు. కానీ... ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇచ్చింది షావోమీ. గతంలో వచ్చిన 8ఏ మోడల్కు కొనసాగింపుగా 8ఏ డ్యూయల్ను తీసుకొచ్చింది షావోమీ.
రెడ్మీ 8ఏ డ్యుయెల్' స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలు చూస్తే యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లాంటి విశేషాలున్నాయి. క ఫీచర్ల విషయానికి వస్తే.. రెడ్మీ 8ఏ డ్యూయల్ 6.22 అంగుళాల హెచ్డీ+, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ కలిగి ఉన్నాయి. అలాగే 2జీబీ, 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలో ఏఐ సీన్ డిటెక్షన్, ఏఐ పోర్ట్రైట్ మోడ్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
అలాగే ఇందులో రెండు వెరియంట్లు ఉన్నాయి. అందులో 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ కల్గిన ఫోన్ ధరను రూ.6,499 కాగా.. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్ను రూ.6,999గా నిర్ణయించారు. అయితే నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, Mi.com, ఎంఐ హోమ్ స్టోర్స్లో రెడ్మీ 8ఏ డ్యుయెల్ సేల్ మొదలైంది. ఇక ఈ ఫోన్ సీ బ్లూ, స్కై వైట్, మిడ్నైట్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి..!