మీరు కొత్త స్మార్ట్ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఇదే సరైన ఛాన్స్. ఎందుకంటే.. ఫ్లిప్కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ నిర్వహించనుంది. ఈ క్రమంలోనే ఈ సేల్ మార్చి 19 నుంచి మార్చి 22 వరకు జరగనుంది. ఇక ఎప్పట్లాగే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది. మరోవిషయం ఏంటంటే... ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఏ ఏ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్కార్ట్ ఆఫర్ అందించిందో ఓ లుక్కేసే సేల్ ప్రారంభించండి.
- సాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో సాంసంగ్ గెలాక్సీ ఏ50 స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999 కాగా ఫ్లిప్కార్ట్ ఆఫర్లో రూ.12,999కు లభిస్తుంది.
- ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్స్ తీసుకొస్తున్న రియల్మీ.. ఇటీవల `రియల్మీ ఎక్స్2` విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రియల్మీ ఎక్స్2 స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.14,999కు లభిస్తుంది.
- ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.36,990. ప్రీపెయిడ్పై రూ.12,000 తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ ఫోన్ రూ.24,990 ధరకే కొనొచ్చు.
- చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వివో తన జెడ్ సిరీస్లో ఇటీవల కొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. వివో జెడ్ 1 ఎక్స్ పేరుతో భారతదేశంలో ప్రారంభించింది. అయితే వివో జెడ్1 ఎక్స్ స్మార్ట్ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,990 కాగా ఆఫర్ ధర రూ.13,990కే లభిస్తుంది.
- రియల్మీ ఎక్స్టీ స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ.14,999కు పొందొచ్చు. మరియు రియల్మీ 5 స్మార్ట్ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్ ధర రూ.8,499 కు పొందొచ్చు.