ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో అద్భుతమైన బ్రాండెడ్ ఫోన్లను అందించిన ఎల్జీ ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ మార్కెట్ లోకి తీసుకువస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అదిరిపోయే డిజైన్ తో వినియోగదారుల ముందుకు వస్తుంది. రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్ తో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు ఎల్జీ ప్రకటన చేసింది. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లను ఎల్జీ తన అధికారిక బ్లాగ్ ద్వారా ప్రకటన చేసింది. చూడటానికి ఎంతో అద్భుతంగా.. ఎన్నడూ ఈ ఫోన్ లేనట్టు కొత్తగా ఉండే విధంగా ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ చేసినట్లు ఎల్జీ తమ ప్రకటనలో తెలిపింది. రెడ్, బ్లూ, పర్పుల్, బ్లాక్, వైట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇంకా ఇన్ని కొత్త ఫీచర్స్.. కొత్త లుక్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడు లాంచ్ అవుతాయి అనే విషయం ఇంత తెలియలేదు.. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ అధికారిక ఫోటోలు కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి.. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ముందుకు రానుంది అని అర్థం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: