ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. ఇప్పటికే 108 ఎంపీ కెమెరా స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇంకా ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా విడుదల అవ్వడం ఆగిపోయాయి. అయితే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా కాస్త ఆలస్యంగా విడుదల అవుతున్నాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే నిన్న గురువారం భారత మార్కెట్లో మోటరోలా తన ఎడ్జ్ + ఫ్లాగ్షిప్ను లాంచ్ చేసింది. మోటో జి సిరీస్లో భాగంగా మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేయనుంది. జీ 8 పవర్ లైట్ పేరుతో తీసుకొస్తున్న బడ్జెట్ స్మార్ట్ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,ట్రిపుల్ రియర్ కెమెరా, అద్భుతమైన డిజైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా విడుదల కానుంది..
మోటరోలా జీ8 పవర్ లైట్ ఫీచర్లు.. స్పీసిఫికేషన్లు!
6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే,
మీడియాటెక్ హీలియో పీ35ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 10,
4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్,
16+2+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా,
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఇంకా మోటరోలా జీ8 పవర్ లైట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,000 గా నిర్ణయించారు.