వినియోగదారులను గూగుల్ సంస్థ మోసం చేస్తోందని అమెరికాలోని అరిజోనా రాష్ట్రం కోర్టుని ఆశ్రయించింది. బుధవారం నాడు అరిజోనా రాష్ట్రానికి చెందిన ఓ లాయర్ గూగుల్ సంస్థ మోసపూరితమైన, అన్యాయమైన మార్గాల ద్వారా తమ వినియోగదారులను మోసం చేస్తోంది అని చెప్పుకొచ్చారు. 


'గూగుల్ సంస్థ తమ వినియోగదారుల యొక్క పూర్తి వివరాలను సేకరిస్తుంది. వినియోగదారులు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా గూగుల్ సంస్థ సేకరిస్తుంది. సరైన అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి గూగుల్ సంస్థ వినియోగదారుల వివరాలను మొత్తం సేకరిస్తుంది. వివరాలు సేకరించే ముందు వినియోగదారుల అనుమతి గూగుల్ సంస్థ తీసుకోవడం లేదు' అని అటార్నీ జనరల్ మార్క్ బ్రూనోవిచ్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. 


అయితే ఈ కన్స్యూమర్ ఫ్రాడ్ కేసుపై గూగుల్ సంస్థ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ... ఎవరైతే కన్జ్యూమర్ కన్స్యూమర్ ఫ్రాడ్ కేసు నమోదు చేశారో... వారు ఖచ్చితంగా మా సేవలను తప్పుగా అర్థం చేసుకున్నారని మేము భావిస్తున్నాం. మేము ఎల్లప్పుడూ మా వినియోగదారుల భద్రతకు భంగం కలిగించడం జరగదు. మా ప్రతి ప్రొడక్టు సేకరించిన లోకేషన్ సమాచారం మొత్తం చాలా భద్రంగా నిల్వ చేయబడుతుంది' అని అన్నాడు. 


ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం తన వినియోగదారుల వ్యక్తిగత విషయాలను సేకరిస్తుందని అరిజోనా రాష్ట్రానికి చెందిన వారు కేసు వేశారు. వినియోగదారులు తమ లొకేషన్ షేర్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించినా... గూగుల్ సంస్థ మాత్రం ఏదో ఒక రూపంలో వినియోగదారుల యొక్క లోకేషన్ సమాచారాన్ని సేకరిస్తుంది అని న్యాయవాది మార్క్ బ్రూనోవిచ్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. 


ఫిబ్రవరి నెలలో న్యూ మెక్సికో కి చెందిన హెక్టార్ అనే ఓ న్యాయవాది గూగుల్ సంస్థ పై కేసు నమోదు చేశాడు. గూగుల్ సంస్థ తయారు చేసిన ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ అనేది పిల్లల యొక్క లోకేషన్ సమాచారాన్ని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరిస్తుందని ఆయన గూగుల్ సంస్థా పై కేసు వేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: