ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి దేశ‌దేశాలు ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. అగ్ర‌రాజ్యాలు సైతం క‌రోనా దెబ్బ‌కు కుదేల్ అవుతున్నాయి అంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా భూతానికి అడ్డుక‌ట్ట వేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఈ స‌మ‌యంలో ఇంట‌ర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. 

 

దీంతో జియో తమ యూజ‌ర్ల కోసం అదిరిపోయే ఫైబ‌ర్ ప్లాన్స్ ప్ర‌క‌టించింది. అందులో ముందుగా.. జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.849. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 600 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ బెనిఫిట్ 200జీబీ, లాక్‌డౌన్ సందర్భంగా డబుల్ డేటా బెనిఫిట్ 200 జీబీ, ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 200 జీబీ డేటా లభిస్తుంది. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో 200 జీబీ డేటా యూజ్ చేసుకోవ‌చ్చు.

 

జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.699. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 250 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ బెనిఫిట్ 100జీబీ, లాక్‌డౌన్ సందర్భంగా డబుల్ డేటా బెనిఫిట్ 100 జీబీ, ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 50 జీబీ డేటా పొందొచ్చు. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో 100 జీబీ డేటా కూడా యూజ్ చేసుకోవ‌చ్చు.

 

జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.1,299. ఇది 30 రోజుల ప్లాన్. 250 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1250 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ బెనిఫిట్ 500జీబీ, లాక్‌డౌన్ సందర్భంగా డబుల్ డేటా బెనిఫిట్ 500 జీబీ, ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 250 జీబీ డేటా లభిస్తుంది. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో 500 జీబీ డేటా కూడా యూజ్ చేసుకోవ‌చ్చు. ఇక ఇప్పుడు చెప్పుకున్న ప్ర‌తి ప్లాన్‌పై వాయిస్ కాల్స్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన గేమింగ్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన టీవీ వీడియో కాలింగ్ ఉచితం. హోమ్ నెట్‌వర్కింగ్ కూడా పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: