హువావే.. ఈ బ్రాండ్ నుండి ఎన్ని అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ తమ వినియోగదారులకు సర్ప్రైజ్ ఇస్తున్న హువావే ఇప్పుడు కూడా మరో అద్భుతమైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.
అదే హువావే ఎంజాయ్ 20 ప్రో స్మార్ట్ ఫోన్. ఈ కొత్త మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్ తో లాంచ్ అయింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ ప్లేను అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు అందించడంతో పాటు సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కూడా అందించారు. ఇంకా అలాంటి ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లు, రెండు ర్యామ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.
ఫీచర్లు.. స్పెసిఫికేషన్ల ఇలా ఉన్నాయి..
6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,
పిక్సెల్ రిజల్యూషన్ 1080x2400 పిక్సెల్స్ గా ఉంది.
ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను కూడా ఇందులో అందించారు.
సెల్ఫీ కెమెరా ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.
బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది.
హువావే ఎంజాయ్ 20 ప్రో స్మార్ట్ ఫోన్ ధరలు..
6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర సుమారు రూ.21,500గా నిర్ణయించారు.
8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర సుమారు రూ.24,800గా నిర్ణయించారు.
డార్క్ బ్లూ, గెలాక్సీ సిల్వర్, మ్యాజిక్ నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చైనాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో హువావే ఇంకా తెలపలేదు.