మొదట చైనాను అతలాకుతలం చేసిన కరోనా.. క్రమంగా దేశదేవాలు విస్తరించి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. అందులో స్మార్ట్ ఫోన్ల పరిశ్రమ కూడా ఒకటి. ఫోన్లను తయారు చేయడంతోపాటు విక్రయాలపై కరోనా బాగానే ఎఫెక్ట్ చూపింది. అయితే ఇప్పుడిప్పుడు మళ్లీ స్మార్ట్ ఫోన్ల పరిశ్రమ కరోనా ప్రభావం నుంచి పుంజుకుంటోంది.
ఇలాంటి సమయంలో రెడ్మీ కే20 ప్రో స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది షావోమీ. గత ఏడాది విడుదలైన ఈ స్మార్ట్ఫోన్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో 6జీబీ+128జీబీ వేరియంట్పై రూ.2,000 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ అవకాశం కేవలం మూడు రోజులు మాత్రమే. అంటే జూలై 13 వరకే ఈ సూపర్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ పాత ధరనే అమల్లోకి వస్తుంది. ఇక రెడ్మీ కే20 ప్రో స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.2,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.24,999 ధరకే లభిస్తోంది.
షావోమీ ఇండియా అధికారిక వెబ్సైట్తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తగ్గింపు ధరకే రెడ్మీ కే20 ప్రో లభిస్తోంది. ఇక రెడ్మీ కే20 ప్రో స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఇందులో అందించారు. 6జీబీ, 8జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో ఈ ఫోన్ పని చేస్తుంది. అలాగే 48+13+8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా.. 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాఉంది. 4000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు డ్యూయెల్ సిమ్ కూడా ఇందులో అందించారు. ప్రస్తుతం గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ బ్లాక్ కలర్స్లో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే.. 6జీబీ+128జీబీ- రూ.24,999 ఉండగా.. 8జీబీ+256జీబీ- రూ.29,999గా నిర్ణయించారు.