ప్రస్తుతం భారత్లో చైనా ఫోన్లకు మరియు చైనా వస్తులకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న వివాదం నేపథ్యంలో చైనాపై వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే భారతీయులు చైనా కంపెనీలకు చెందిన మొబైల్స్ లేదా ఇతరితర వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. అయితే ఇలాంటి సమయంలో భారతదేశానికి చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ లావా ఇంటర్నేషనల్ కొత్త మొబైల్ను రిలీజ్ చేసింది. అదే లావా జెడ్61 ప్రో స్మార్ట్ ఫోన్.
రెండేళ్ల క్రితం లావా జెడ్61 స్మార్ట్ఫోన్ రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పుడు లావా జెడ్61 ప్రో మోడల్ను తీసుకొచ్చింది. ఇది మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ఫోన్ కావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది.. ఇక ఈ ఫోన్ లో కేవలం 2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర చాలా తక్కువ. లావా జెడ్61 ప్రో రూ.5,774కే లభ్యమవుతోంది. లావా జెడ్61 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు.
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా.. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది. పొర్ ట్రెయిట్ మోడ్, బరస్ట్ మోడ్, పనోరమ, ఫిల్టర్స్, బ్యూటీ మోడ్, హెచ్ డీఆర్, నైట్ మోడ్ లు కూడా ఇందులో ఉన్నాయి. 3100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వీటితో పాటు బ్లూటూత్ 4.2, వైఫై, జీపీఎస్, యూఎస్ బీ ఓటీజీ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి. మిడ్ నైట్ బ్లూ, యాంబర్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ను సేల్ చేయాలపుకునేవారు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల్లో తీసుకోవచ్చు.