మీరు ట్యాబ్‌ కొనుక్కోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్.  హువావే కంపెనీ నుంచి మేట్‌ప్యాడ్ టి 8  పేరిట నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ మన భారత్ ‌లో విడుదలైంది. దీనిని  ఫ్లిప్ కార్ట్‌ లో విక్రయిస్తారు. నిజముగా ఈ ట్యాబ్ ఫీచర్స్ అదిరి పోయాయి అనే చెప్పాలి. మరి ఈ  హువావే కంపెనీ మేట్‌ప్యాడ్ టి 8 ట్యాబ్‌ గురించి ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ఈ ట్యాబ్ లో 8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ ని కంపెనీ ఏర్పాటు చేశారు.  అలానే ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 8768 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇందు లో అందిస్తున్నారు. బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 5100 ఎంఏహెచ్ గా ఉంది .

ఇక దీని స్టోరేజ్ విషయానికి వస్తే..... 2జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. కెమెరా విషయానికి వస్తే వెనుక, ముందు 5, 2 మెగా పిక్సల్ కెమెరాలు ఉన్నాయి.  రంగుల విషయానికి వస్తే..... హువావే మేట్ ప్యాడ్ టి8 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ డీప్ సీ బ్లూ కలర్ ఆప్షన్‌లో విడుదలైంది. ఈ ట్యాబ్లెట్‌కు చెందిన వైఫై వేరియెంట్ ధర రూ.9,999 ఉండగా , ఎల్‌టీఈ వేరియెంట్ ధర రూ.10,999 గా ఉంది.

బ్లూటూత్ 5.0 ఎల్ఈ, జీపీఎస్‌, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం జాక్ ని అందించారు. అలానే 8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 8768 ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ ని కలిగి  ఉంది. 5, 2 మెగాపిక్సల్ బ్యాక్ ‌, ఫ్రంట్ కెమెరాలు, ఎల్‌టీఈ సపోర్ట్‌, డ్యుయల్ బ్యాండ్ వైఫై , 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ , ఆండ్రాయిడ్ 10 ఓఎస్ వంటివి బాగా ఆకర్షిస్తున్నాయి .



మరింత సమాచారం తెలుసుకోండి: