ఇప్పుడు దసరా పండుగ పూర్తయింది.. ఇప్పుడు దీపావళికి మరిన్ని ఆఫర్లు.. మరో కొత్త ఫీచర్లతో జనాలకు అద్భుతమైన ఆఫర్లునూ అందిస్తున్నారు. ఇంకా వాటి తో పాటుగా ఆన్ లైన్ మార్కెట్లు మరింత  దూకుడుగా వ్యవహరిస్తున్నారు.  మా సైట్ లో కొనండి ఆఫర్లు అంటే ఇలా ఉంటాయి అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. అందులో ఇప్పుడు ప్రముఖంగా వినిపించే పేరు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు.. దీపావళికి వీరిద్దరూ అందించే ఆఫర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..



ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాలీ సేల్ ప్రారంభం అయిపోయింది. ఈ సేల్ నవంబర్ 4వ తేదీ వరకు జరగనుంది. పోకో, మోటొరోలా, రియల్ మీ, ఇతర ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటు లో ఉన్నాయి. పోకో, మోటొరోలా స్మార్ట్ ఫోన్ల పై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అదనపు  ఆఫర్ల తో డిస్కౌంట్ ను ఇస్తున్నారు. ఎల్జీ జీ8ఎక్స్ స్మార్ట్ ఫోన్ సేల్ ను నవంబర్ 3 న ప్రారంభించనున్నారు.



వీటితో పాటుగా చాలా ఫోన్లు సరికొత్తగా ఫీచర్లు ఉండి చాలా ఆకర్షణీయమైన అదిరిపోయే బొనాజ ను ఇస్తున్నారు.రూ.14,999 విలువైన రియల్ మీ నార్జో 20 ప్రో స్మార్ట్ ఫోన్‌ను రూ.13,999కే అందిస్తున్నారు. రియల్ మీ సీ11 ధర కూడా రూ.500 తగ్గింది. దీని అసలు ధర రూ.7,499 కాగా, ప్రస్తుతం రూ.6,999కే అందుబాటులో ఉంది. రియల్ మీ సీ15 ధర కూడా రూ.9,499 నుంచి రూ.8,999కు పడిపోయింది. ఇలా చూసుకుంటే ఈ సీజన్ లో ప్లిప్ కార్ట్ లో అందుబాటు లో ఉన్నాయి. మొత్తానికి సూపర్ ఫోన్లు ఇక్కడ కనిపిస్తు న్నాయి.. ఎల్జీ జీ8ఎక్స్‌పై కూడా తగ్గింపు ధర అందుబాటులో ఉంది. రూ.70 వేల విలువైన ఈ ఫోన్ ధరను రూ.24,990కే తగ్గించారు .. కళ్లు జిగేల్ మనే ఫోన్లు ఆఫర్లు చాలానే ఉన్నాయి.. నవంబర్ 3 నుంచి సేల్స్ జరగనున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: