అయితే భారత్ మాత్రం దీన్ని రీప్లేస్ చేసే యోచనలో ఉందట. ఇటీవల భద్రత కారణంగా చాలా చైనీస్ యాప్లను బ్యాన్ చేసిన భారత్.. ఇప్పుడు అమెజాన్పై దృష్టి పెట్టిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి అమెజాన్ వంటి ఓ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ విడుదల అవబోతోందట. దీనిలో కూడా అమెజాన్లో లాగానే అన్ని వస్తువులూ లభిస్తాయని సమాచారం.
ఈ ప్లాట్ ఫామ్ ఏర్పాటు కోసం చర్చించేందుకు ఓ కమిటీని నియమించిందట భారత ప్రభుత్వం. యాప్ ఎప్పుడొస్తుంది? వంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలీదు. అయితే దీని కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మాత్రం 11 మంది సీనియర్ అధికారులు ఉంటారట. వీరే ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ గురించి చర్చించి, ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. గతంలో అమెజాన్కు పోటీగా భారత్కు చెందిన ఫ్లిప్ కార్ట్ మార్కెట్లో ఉండేది.
అయితే ఇది కూడా తర్వాతి కాలంలో అమెరికాకు చెందిన అగ్ర కంపెనీ వాల్మార్ట్లో కలిసిపోయింది. దీంతో భారత్కు ప్రత్యేకంగా ఉన్న ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ లేవు. ఒక వేళ ఉన్నా అవి చాలా చిన్నవి కావడంతో పెద్దగా పాపులర్ అవ్వలేదు. అందుకే ఈ పరిస్థితిని మార్చడం కోసమే ప్రభుత్వం స్వయంగా ముందడుగు వేసి అమెజాన్ వంటి భారీ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని చూస్తోందని సమాచారం.