అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ గ్రేట్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, టీవీలు వంటి వాటిపై భారీ తగ్గింపు అందించనున్నారు. ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 19వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్‌ పై 60 శాతం వరకు, అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ వంటి ఉత్పత్తులపై 40 శాతం వరకు తగ్గింపు అందించనున్నారని అమెజాన్ వెల్లడించింది.



ఇకపోతే ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డులపై కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపును కూడా అందిస్తున్నారు. ఈ సేల్ జనవరి 23 వరకు జరగనుంది.సాధారణ వినియోగదారులకు జనవరి 20వ తేదీ నుంచి, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు జనవరి 19వ తేదీ నుంచి ఈ సేల్ జరగనుంది. పవర్ బ్యాంకులు, హెడ్‌సెట్లు, కేబుల్స్, కేసులు, కవర్లు వంటి మొబైల్ యాక్సెసరీలపై కూడా కళ్లు జిగేల్ మనే తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు తెలిపారు.



మరో విషయమేంటంటే గృహోపకరణాలపై కూడా భారీ తగ్గింపు అందించనున్నారు. టీవీలు రూ.6,799 నుంచి ప్రారంభం కానున్నాయి. నో కాస్ట్ ఈఎంఐ కూడా రూ.3,300 నుంచి ప్రారంభం కానుంది. ఎకో స్మార్ట్ స్పీకర్లపై 40 శాతం తగ్గింపు, ఫైర్ టీవీ స్టిక్‌పై 40 శాతం తగ్గింపు అందించనున్నారు. ఈ సెల్ లో భాగంగా దాదాపు 4 వేలకు పైగా ఎలెక్ట్రానిక్ వస్తువులపై తగ్గింపు ను అందిస్తున్నారు.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ ఈఎంఐల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ లభించనుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ అందించనున్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి కూడా మంచి తగ్గింపు ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: