భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు చెందిన మాజీ శాస్త్రవేత్తలు పవన్కుమార్ చందన, నాగభరత్ తో పాటు ఇంకొందరు 2018 జూన్ 12న ‘స్కైరూట్' స్టార్టప్ను ప్రారంభించారు. ఇప్పుడు స్కైరూట్ తన తొలి ప్రయోగాన్ని ఎప్పుడు ప్రయోగించబోతున్నామో తెలిపింది . ఈ సందర్బంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొదటి సొంత రాకెట్ ను ప్రయోగించబోతున్నామని పవన్కుమార్ చందన తెలిపారు. అయితే రాకెట్ ప్రయోగాల కోసం వీళ్ళు ఇస్రో సహకారం తీసుకుంటున్నారు.
ఇక స్కైరూట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే రాకెట్ బరువును తగ్గించడం, మరియు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లేలా చేయడం, ప్రస్తుతం ఈ సంస్థ ‘స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్స్'ను (SSLV) అభివృద్ధి చేస్తున్నది. వీటికి విక్రమ్-1, 2, 3 అని నామకరణం చేసింది. ‘కలాం’ పేరుతో ప్రత్యేకంగా రాకెట్ ఇంజిన్లను రూపొందిస్తున్నది. డిసెంబర్ చివరి నాటికీ ప్రయోగించబోతున్న ‘విక్రమ్-1’లో ఉపయోగించే ‘కలాం-5’ ఇంజిన్ను ఇటీవలే టెస్ట్ ఫైర్ చేసింది. విక్రమ్-1 ద్వారా కక్ష్యలోకి ఎక్కువ ఉపగ్రహాలను పంపేందుకు స్కైరూట్ ప్రయత్నిస్తుంది .. ఇక స్పేస్ కేటగిరీలో గత ఏడాదికి గాను నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ లో భాగంగా స్కైరూట్కు ఉత్తమ సంస్థ అవార్డు దక్కించుకోవడం విశేషం ..