టెలికాం సంస్థ రిలయన్స్ జియో అతి త్వరలోనే జియో బుక్ పేరిట ఓ ల్యాప్టాప్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బ్లూబ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే సంస్థ తో భాగస్వామ్యం అయిన జియో చవక ధరకు జియో బుక్ పేరిట ఓ ల్యాప్ టాప్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అందులో స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 4జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందివ్వనున్నారని సమాచారం.
అయితే జియో బుక్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అందిస్తారని తెలుస్తోంది. ఇక ఆ ల్యాప్టాప్ ధర ఎంత ఉంటుంది ? అనే వివరాలు తెలియలేదు. కానీ మార్కెట్ లో అందుబాటు లో ఉన్న బేసిక్ ల్యాప్ టాప్ల కన్నా తక్కువ ధరకే ఆ ల్యాప్ టాప్ను జియో అందిస్తుందని తెలిసింది. ఇక అతి త్వరలోనే ఆ ల్యాప్ టాప్ను జియో విడుదల చేస్తుందని తెలుస్తోంది. కరోనా సమయం లో చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొనే వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగ పడుతుంది. .. ఎంతైనా జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందుబాటు లోకి తీసుకు వస్తుంది.చదువు కోసం ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్ల వంటి డివైస్ లు అవసరం అయ్యాయి... అందుకే వారికి సాయంగా ఉండాలని ఈ ఆలోచన చేసినట్లు సమాచారం..