ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లలో మార్కెట్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి క్వాలిటీ బ్రాండ్ గా పోకో ప్రజల్లో స్థానం సంపాధించుకుంది. పోకో నుండి వచ్చే ఫోన్ల కోసం మొబైల్ యూజర్లు ఎంతగానో ఎదురు చూస్తూంటారు. తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను మొబైల్స్ లో అందిస్తూ ఇతర బ్రాండ్ లకు పోకో గట్టి పోటీగా నిలుస్తుంది. ఇక పోకో నుండి గత ఏడాది వచ్చిన పోకో ఎమ్2 మొబైల్ యూజర్లను గట్టిగానే ఆకర్షించింది.
 కేవలం 10 వేలలోనే 6 జీబి ర్యామ్, 64 జీబి రోమ్ కలిగిన మొబైల్ కావడంతో మార్కెట్ లో విపరీతంగా సెల్ అయ్యింది. దీంతో ఈ మొబైల్ కు సక్ససర్ గా కొద్ది రోజుల క్రితమే పోకో ఎమ్ 2 రీలోడెడ్ అనే మరో మొబైల్ ను మార్కెట్ లోకి లంచ్ చేసింది పోకో. గతేడాది పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ కాగా, లేటెస్ట్‌గా వచ్చిన పోకో ఎం2 రీలోడెడ్  4జీబీ+64జీబీ వేరియంట్‌ లో రిలీజ్ చేసింది. ఇక ఈ మొబైల్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,499 /-.
 ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పై ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. మీదగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.8,900 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే పోకో ఎం2 రీలోడెడ్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను కేవలం రూ.599 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక మరోక ఆఫర్ లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫోన్ కొన్న వారికి  5 శాతం ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్‌కార్డ్ డెబిట్ కార్డ్‌తో మొదటిసారి ట్రాన్సాక్షన్ చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మరి పది వేలలోపు మొబైల్ కొనాలనుకునే వారికి పోకో ఎమ్2 రీలోడెడ్ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.     .  .

మరింత సమాచారం తెలుసుకోండి: