ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా ఓటిటీల హవా బాగానే పెరిగిపోయింది. థియేటర్లలో విడుదలైన సినిమాలు కనీసం 30 రోజులు తిరగకుండానే ఓటీటి లో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. దీంతో ఓటీటి బిజినెస్ కూడా మూడింతలు రెట్టింపు పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓటీటి ల మధ్య పోటీ కూడా బాగానే పెరిగిపోయింది. దీంతో ఎలాగైనా యూజర్లను ఆకట్టుకొనే పని లో పడ్డాయి పలు ఓటీటి సంస్థలు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలు రకాలుగా ఆఫర్లను అందిస్తూనే ఉన్నాయి. దీంతో పాటు టెలికామ్ సంస్థలతో ఒప్పందం చేసుకొని.. ఓటిటి సేవలను ప్రజలకు అందిస్తూనే ఉన్నాయి.

తాజాగా రిలయన్స్ జియో ఇలాంటి ఒక బెస్ట్ ఆఫర్ ని కూడా ప్రకటించడం జరిగింది. జియో పోస్ట్ పెయిడ్ ఫ్యాన్లను ఎంపిక చేసుకున్న వారికి ఉచితంగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఇందులో ముఖ్యంగా రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ 1499 రూపాయలు విలువ చేసిన ప్లాన్లను మై జియో ఉచితంగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబ్ చేయండి అవకాశం కల్పిస్తోంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో ఇంటర్నెట్ డేటాతో పాటు జియో టీవీను మరియు ఇతర జియో యాప్లను ఉచితంగా సబ్స్క్రిప్షన్ లో పొందవచ్చు.


ఇదంతా ఇలా ఉండగా జియో కేవలం పోస్ట్ పెయిడ్ ప్రియులకు మాత్రమే కాకుండా ప్రిపేడ్ యూసర్ల కు సైతం ఉచితంగా పలు ఓటిటి వాటిని కూడా అందిస్తోంది. అయితే ప్రీపెయిడ్ ప్లాన్లు ఆఫర్లలో మాత్రం కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ వంటి సబ్స్క్రిప్షన్ లను మాత్రమే అందిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కేవలం పోస్ట్ పెయిడ్ సేవలను పొందే వారికి మాత్రమే ఉచితంగా ఇలాంటి సేవలను అందుబాటులో తీసుకువచ్చింది. ప్రస్తుతం ధరలలో అన్నిటికంటే నెట్లెక్స్ చాలా తక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు కనుక ఇలాంటి వాటికి ఇలాంటి ఆఫర్లు పెట్టి తమ కస్టమర్లను పెంచుకోవడం కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: