ఇంటర్నెట్ బ్రౌజర్ అనగానే ఫీచర్స్ మాత్రం గొప్పగా ఉంటే సరిపోదు. సెక్యూరిటీ అన్నిటికంటే ముఖ్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే నెట్ లేకుండా ఎవ్వరికి క్షణం గడవడం లేదు. అసలు ప్రపంచంలో చాలా మంది నెట్లోనే 24 గంటలు జీవిస్తున్న వారు కూడా ఉన్నారు.
ఇంటర్నెట్ ఎంతో పెరిగిపోయిన ఈ కాలంలో - ఆన్లైన్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనది. అందుకే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తన కొత్త క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్ని ఎలాంటి సమస్యలూ లేకుండా బగ్స్-ఫ్రీ గా చేయాలని నిర్ణయించుకుంది. వాస్తవంగా చూస్తే ఈ బ్రౌజర్ గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ లతో పోటీ పడలేక ఇంతకాలం చతికిలబడింది.
అందుకే తన ఎడ్జ్ బ్రౌజర్కు కొత్త క్రేజ్ తెచ్చేందుకు ఒక 'బగ్ బౌంటీ ప్రోగ్రామ్' ప్రారంభించింది. ఇదేం కొత్తది కాదు.. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు చేసేదే. కంపెనీలు బీటా వెర్షన్ యూజర్లకి అందించి, దాన్ని వాళ్లు వాడేలా చేస్తారు. అందులో ఏ బగ్స్ ఉన్నాయో కనిపెడితే బహుమతులిస్తారు.
ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా అదే పంథాను ఫాలో అవుతోంది. ఈ బ్రౌజర్లో ఏ లోపాలున్నాయో చెబితే - ముఖ్యమైన బగ్స్ని గుర్తించినవారికి ముప్ఫైవేల డాలర్లు బహుమతి ఇస్తోంది. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు 21 లక్షల రూపాయలు. సో మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ క్రోమియం బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోండి. బగ్స్ కనిపెట్టగలిగితే కనిపెడితే ఆ రూ.21 లక్షలు మీ సొంతం.