మొబైల్ దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్‌ రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. గతంలో తనకి పోటీగా మరే మొబైల్ కంపెనీ కూడా పోటీ లేని సమయంలో రారాజుగా ఉన్న శామ్‌సంగ్‌ ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన స్మార్ట్ ఫోన్ కంపెనీల కారణంగా నిత్యం సరికొత్త మోడల్ తో ఆకర్షణీయమైన ధరలతో వినియోగదారులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

 Image result for galaxy A 10 s

అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే రేట్లతో చౌకగా, ఖరీదైన మొబైల్స్ ని ఆవిష్కరిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మార్కెట్ లోకి చౌకగా అధినాతన ఫీచర్స్ కి అనుగుణంగా ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోడల్  “గెలాక్సీ ఏ 10 ఎస్”

 Image result for samsung galaxy a10s launch

ఈ స్మార్ట్ ఫోన్ ని మంగళవారం నాడు ఇండియా మార్కెట్ లోకి విడుదల చేసింది.  2 జీబీ ర్యామ్ , 32 జీబీ స్పేస్ తో రూ 9,499 ధారగా ప్రకటించింది. అదేవిధంగా 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్పేస్ తో రూ 10,499 ధారగా ప్రకటించింది. ఈ మొబైల్స్ 6.2 స్క్రీన్ తో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు డ్యుయల్ కెమెరా, 8 ఎంపీ సేల్ఫీ కెమెరా నిక్షిప్తం అయ్యి ఉంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: